Political News

ఇకపై అలా జరగదన్న బోండా ఉమ

దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఉమ సన్నిహితంగా ఉండడం, చంద్రబాబు ఆదేశాలు బేఖాతరు చేసి వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడంపై టీడీపీ హై కమాండ్ సీరియస్ అయింది.

ఈ క్రమంలోనే ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్ లతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీని కలిసి బోండా ఉమ వివరణనిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇకపై వైసీపీ నేతలు హాజరయ్యే కార్యక్రమాలకు తాను హాజరు కాబోనని బోండా ఉమ స్పష్టం చేశారు. తాను పాతికేళ్లుగా పార్టీలో ఉన్నానని, ఏనాడూ పార్టీ లైన్ దాటలేదని అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు ధిక్కరించేలా ఏరోజూ ప్రవర్తించలేదని, ప్రవర్తించబోనని చెప్పారు. 2019-24 మధ్యకాలంలో ప్రాణాలొడ్డి పార్టీని కాపాడుకునేందుకు ఏ విధంగా పనిచేశానో అందరికీ తెలుసని, అందుకు మీడియా కూడా సాక్షి అని చెప్పారు.

ముద్రగడ సంస్మరణ సభ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తన దగ్గరకు వచ్చి పలకరించారని, మాట్లాడుకున్నామని అన్నారు. అది వాస్తవమేనని, బహిరంగ వేదికపైనే జరిగిందని చెప్పారు. కాపు జేఏసీ తరఫున ఆ కార్యక్రమం చేశారని, తనను ఆహ్వానించారు కాబట్టి అన్ని పార్టీలకు చెందిన నేతలతో పాటు వేదికను పంచుకోవాల్సి వచ్చిందని వివరణనిచ్చారు.

కానీ, ఆ విషయం గురించి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరిగిందని, ట్రోలింగ్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించారని, అక్కడ జరిగిన కలయిక వేరని చెప్పారు. ఈ విషయమే కమిటీ ముందు వివరించానని అన్నారు.

This post was last modified on July 28, 2026 7:10 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

43 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago