Political News

ఇకపై అలా జరగదన్న బోండా ఉమ

దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఉమ సన్నిహితంగా ఉండడం, చంద్రబాబు ఆదేశాలు బేఖాతరు చేసి వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడంపై టీడీపీ హై కమాండ్ సీరియస్ అయింది.

ఈ క్రమంలోనే ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్ లతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీని కలిసి బోండా ఉమ వివరణనిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇకపై వైసీపీ నేతలు హాజరయ్యే కార్యక్రమాలకు తాను హాజరు కాబోనని బోండా ఉమ స్పష్టం చేశారు. తాను పాతికేళ్లుగా పార్టీలో ఉన్నానని, ఏనాడూ పార్టీ లైన్ దాటలేదని అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు ధిక్కరించేలా ఏరోజూ ప్రవర్తించలేదని, ప్రవర్తించబోనని చెప్పారు. 2019-24 మధ్యకాలంలో ప్రాణాలొడ్డి పార్టీని కాపాడుకునేందుకు ఏ విధంగా పనిచేశానో అందరికీ తెలుసని, అందుకు మీడియా కూడా సాక్షి అని చెప్పారు.

ముద్రగడ సంస్మరణ సభ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తన దగ్గరకు వచ్చి పలకరించారని, మాట్లాడుకున్నామని అన్నారు. అది వాస్తవమేనని, బహిరంగ వేదికపైనే జరిగిందని చెప్పారు. కాపు జేఏసీ తరఫున ఆ కార్యక్రమం చేశారని, తనను ఆహ్వానించారు కాబట్టి అన్ని పార్టీలకు చెందిన నేతలతో పాటు వేదికను పంచుకోవాల్సి వచ్చిందని వివరణనిచ్చారు.

కానీ, ఆ విషయం గురించి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరిగిందని, ట్రోలింగ్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించారని, అక్కడ జరిగిన కలయిక వేరని చెప్పారు. ఈ విషయమే కమిటీ ముందు వివరించానని అన్నారు.

This post was last modified on July 28, 2026 7:10 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

2 hours ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

3 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

4 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

5 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

7 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

7 hours ago