Political News

మహిళల జోలికి వస్తే ఎవరైనా ఒకటే

గుంటూరులో మహిళపై దాడి చేసి, నడిరోడ్డుపై వివస్త్రను చేసిన ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుబంధం లేదా పార్టీ సభ్యత్వం రక్షిస్తుందని ఎవరైనా భావిస్తే అది పెద్ద పొరపాటేనని స్పష్టం చేశారు.

గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఈ నెల 15న ఇంటి ముందు మోటార్‌తో నీరు పట్టుకుంటున్న మహిళతో 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యుడిపై దాడి చేసి, మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసినట్లు ఆరోపణలు రావడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై స్పందించిన లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారని వెల్లడించారు. ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకుడిని పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేయాలని తాను ఆదేశించినట్లు తెలిపారు.

మహిళను అవమానించడం అంటే సమాజ విలువలను అవమానించినట్లేనని పేర్కొన్న లోకేష్, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వారిపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, తప్పు చేసిన వారికి రాజకీయ అండ ఉండదని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి కూడా ఘటనపై తీవ్రంగా స్పందించి నిందితుడిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్లెల వెంకటరమణమూర్తితో పాటు మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

This post was last modified on July 18, 2026 11:11 am

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

3 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

6 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

6 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

7 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

9 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

10 hours ago