వైసీపీ నుంచి బయటకు వచ్చిన మహిళా నాయకురాలు.. వాసిరెడ్డి పద్మకు పొలిటికల్గా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా మంత్రి నారా లోకేష్తో ఆమె భేటీ అయ్యారు. దీంతో త్వరలోనే ఆమె టీడీపీ కండువా కప్పుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ దూకుడుగా ఉండే వాసిరెడ్డి పద్మ దాదాపు 20 ఏళ్లకుపైగానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
వైసీపీ అధికార ప్రతినిధిగా.. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మహిళా కమిషన్ చైర్ పర్సన్గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా.. జగన్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. దీంతో అప్పటి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన పద్మ.. సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. జగన్ కారణంగానే అందరూ ఓడిపోయారని అన్నారు.
పార్టీని నడిపించడం.. నాయకులను సమన్వయం చేయడం కూడా రాదని పద్మ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆమె.. అప్పటి నుంచి ఏ పార్టీలోనూ చేరకుండా మౌనంగా ఉన్నారు. సుమారు ఏడాదిన్నరగా మౌనంగా ఉన్న పద్మ.. తాజాగా టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్తో ఆమె భేటీ అయ్యారు. ఆయన పనితీరు, మంత్రి వర్గంలో వ్యవహరిస్తున్న తీరునుకొనియాడారు.
అయితే.. ఇప్పటికిప్పుడు వాసిరెడ్డి చేరికపై పార్టీలో ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పద్మకు అవకాశం దక్కుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పైగా వచ్చే ఎన్నికల నాటికి మహిళలకు ప్రాధాన్యం పెరుగుతున్న దరిమిలా వాసిరెడ్డికి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు కూడా మంచి అవకాశం చిక్కే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on July 17, 2026 10:20 am
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…