రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా ఆదాయ వనరులను పూర్తిగా దెబ్బతీసి, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా అమెరికా సెనేటర్లు ఒక సరికొత్త ఆంక్షల బిల్లును తెరపైకి తెచ్చారు. ఈ బిల్లు ప్రకారం రష్యా ఆయిల్ కొనే ఇండియా, చైనాతో పాటు మరో మూడు దేశాల ఎగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్ (సుంకాలు) విధించే ప్రమాదం పొంచి ఉంది.
వాషింగ్టన్ లో మంగళవారం జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ ఈ కొత్త బిల్లు వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం రష్యా నుంచి భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తున్న చైనా, ఇండియా, స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ దేశాలను టార్గెట్ చేస్తూ ఈ కఠిన నిబంధనలను రూపొందించారు. అయితే రష్యా గ్యాస్ ఇంపోర్ట్స్ లో 15 శాతం కంటే తక్కువ కొంటూ, ఆ కొనుగోళ్లను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న దేశాలకు మాత్రం ఇందులో కొంత మినహాయింపు ఇచ్చారు.
నిజానికి గత ఏడాది ఏప్రిల్ లో ‘శాంక్షనింగ్ రష్యా యాక్ట్’ పేరుతో ఒక బిల్లు వచ్చింది, అందులో ఏకంగా 500 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదించారు. కానీ ఆ నిబంధనలు మరీ కఠినంగా ఉండటం, ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి సరైన సపోర్ట్ లేకపోవడంతో ఆ బిల్లు ఓటింగ్కు రాలేకపోయింది. ఇప్పుడు దాన్ని కాస్త మార్చి, గరిష్టంగా 100 శాతం టారిఫ్ ఉండేలా ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుకు వైట్ హౌస్ నుంచి కూడా పూర్తి మద్దతు లభించింది.
ఈ బిల్లు ఆగస్టు కంటే ముందే పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సెనేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ దేశంపై ఎంత శాతం టారిఫ్ విధించాలనేది అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ నిర్ణయిస్తారు. రష్యా నుంచి ఆయిల్ కొనకుండా ఆయా దేశాలను నిరుత్సాహపరిచే స్థాయిలోనే ఈ రేట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ టారిఫ్ రేట్లను తగ్గించాల్సి వస్తే దానికి గల కారణాలను కాంగ్రెస్ కు నివేదించాల్సి ఉంటుంది.
ఈ బిల్లును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి, గత వారం అకస్మాత్తుగా కన్నుమూసిన సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహం సేవలను ఈ సందర్భంగా సహచర సెనేటర్లు గుర్తుచేసుకున్నారు. రష్యా రక్షణ, ఆర్థిక, పారిశ్రామిక రంగాలను దెబ్బతీసేలా ఉన్న ఈ బిల్లు కనక చట్టంగా మారితే భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. మరి ఈ కొత్త సంక్షోభాన్ని ఇండియా తన దౌత్య నీతితో ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…