ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉండటం, ఆయా అంశాలపై కీలక నిర్ణయాలను కేడర్ తో పంచుకోవడం వంటి పలు కీలక పనులను సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఏపీలో విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఓ సూపర్ యాప్ ను ఆవిష్కరించింది. ఈ యాప్ ను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… గురువారం నాటి పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆవిష్కరించారు. జగన్ 2.0 సూపర్ యాప్ అని దీనికి పేరు పెట్టారు.
రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా యాప్ తరహా టెక్నాలజీ కొత్తేమీ కాదు. చాలా పార్టీలు తమ కేడర్ కోసం, తమ ఐడియాలజీని క్షేత్రస్థాయిలోని కేడర్ దాకా చేరవేయడం, పార్టీ కేడర్ కు అందించే సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వ నమోదు తదితరాల కోసం దాదాపుగా అన్ని పార్టీలు యాప్ తరహా ఏర్పాట్లను చేసుకొంటున్నాయి. అందులో భాగంగానే వైసీపీ తన యాప్ నూ ప్రారంభించింది. జగన్ 2.0 సూపర్ యాప్ పేరిట ప్రారంభించిన ఈ యాప్ ను పార్టీ కార్యకర్తలంతా డౌన్ లోడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా జగన్ పిలుపునిచ్చారు.
జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించిన సందర్భంగా దాని ద్వారా ఏమేం చేస్తామన్న విషయాన్ని కూడా జగన్ ఓ మోస్తరుగా వివరించారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం యమా యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పార్టీకి అనుకూలంగా సాగుతున్న పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా పార్టీకి ఓ రేంజిలో సహకారం అందిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయా పోస్టులను ఎడిట్ చేసో, వక్రీకరించో వాటిపై విష ప్రచారం చేస్తున్నారని… ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఈ తరహా యత్నాలను సూపర్ యాప్ ద్వారా అదిగమించవచ్చని జగన్ చెప్పారు.
జగన్ 2.0 సూపర్ యాప్ ప్రధాన ఉద్దేశ్యం పార్టీ అధినాయకత్వంతో క్షేత్రస్థాయి కార్యకర్తను అనుసంధానించడమేనని చెప్పాలి. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఈ యాప్ ద్వారా పార్టీ చివరి స్థాయిలో ఉండే కేడర్ కు నేరుగా చేరవేయడం ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పొచ్చు. అంటే… పార్టీ తీసుకునే ఏ కీలక నిర్ణయంపై అయినా పార్టీ కేడర్ తప్పుగా అర్థం చేసుకోవడమనే సమస్య ఉండదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా పార్టీ కేడర్ పై జరిగే దౌర్జన్యాలు, వేధింపులను కూడా ఈ యాప్ లో పొందుపరచడం ద్వారా పార్టీ కేడర్ కు మరింత వెన్నుదన్ను అందించినట్టు అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం ఇప్పటికే డిజిటల్ డైరీని వైసీపీ ఏర్పాటు చేయగా…ఇప్పుడు దానిని ఈ సూపర్ యాప్ కు అనుసంధానం చేయనున్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు.
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…
ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…