యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే… ఇతర ప్రాంతాల గురించి అటుంచితే… ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే భావన వ్యక్తమవుతోంది. మునుపటి మాదిరిగా వందలు, వేల సంఖ్యలో కరోనా కేసులు లేకున్నా… అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు వెలువడే స్థాయిలో మాత్రం కొత్త కేసులు నమోదయ్యాయి. గత నెల 26 నుంచి గురువారం వరకు నమోదు అయిన కేసుల వివరాలే ఈ తరహా అప్రమత్తతను చాటి చెబుతున్నాయి.
దాదాపుగా రెండేళ్లకు పైబడి కరోనా విశ్వవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. వేలు దాటి లక్షల సంఖ్యలో జనం ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇతర దేశాల మాదిరే భారత్ లోనూ ఈ వైరస్ పెను ప్రకంపనలే సృష్టించింది. అయితే గడచిన నాలుగేళ్లుగా పెద్దగా కేసులు లేకున్నా… అడపాదడపా అక్కడొకటి, ఇక్కడొకటి అన్నచందంగా అప్పుడప్పుడే కరోనా కేసులు నమోదు అయినా పెద్ద ప్రమాదమేమీ లేదనే చెప్పాలి. అయితే కరోనా వైరస్ ను ఈజీగా పరిగణించరాదన్న రీతిలో ఏపీటో ఇప్పుడు వరుసగా కేసులు నమోదు అయ్యాయి. ఏకంగా నలుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఏపీలో గడచిన 20 రోజుల వ్యవధిలో ఏకంగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో అత్యధికం కడప జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. ఒక్క కడప జిల్లాలోనే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు జిల్లాలో రెండు, విశాఖ, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.
కరోనా సోకిన 12 మందిలో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా… ముగ్గురు కోలుకున్నారు. ఇక మిగిలిన వారిలో ముగ్గురు హోం ఐపోలేషన్ లో ఉండగా… ఇద్దరు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
This post was last modified on July 16, 2026 11:16 pm
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…