ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య తలెత్తకుండా పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి నీటి ప్రవాహం క్షీణించడంతో కృష్ణా డెల్టా సాగుపై అనిశ్చితి నెలకొంది. పులిచింతల జలాశయంలో ఉన్న 32 టీఎంసీల నీరు మాత్రమే లక్షల ఎకరాల ఆయకట్టుకు సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా 2015లో ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం రైతులకు ఆధారంగా మారింది.
ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోందని, సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందని కేటీఆర్ కితాబిచ్చారు..అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు.
నీటిపారుదల రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
This post was last modified on July 15, 2026 10:22 pm
తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో రోజుకో నాయకుడు ఏదోకటి మాట్లాడుతూ మీడియాకు చేతినిండా పని పెడుతున్నారు. ఒకరోజు కొండా సురేఖ, మరో…
కేవలం తొమ్మిది రోజుల్లో ది ప్యారడైజ్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన అంచనాలతో పాటు ఒత్తిడి కూడా అదే స్థాయిలో…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్…
రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…
గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…