కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే ఉత్తరం మూలన ఈ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అదినేత, మాజీ సీఎం జగన్.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తొలుత నివాళులర్పించిన ఆయన.. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముద్రగడ ఆశయాలను నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నం కూడా చేస్తామన్నారు.
అనంతరం చేపట్టిన అంతిమ యాత్రలో(కొద్ది దూరం) ముద్రగడ పాడెను మోసిన జగన్.. ఆయన అంతిమ సంస్కారాన్ని దగ్గర ఉండి నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి.. వెళ్లిపోయారు. కుమారుడు గిరి తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించి.. అంత్యక్రియలు నిర్వహించారు. తుది కార్యక్రమాల్లో పలు జిల్లాల నుంచి కాపు నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే.. ఇంటి ఆవరణలో వారంతా అడుగు పెడితే.. తొక్కిసలాట జరుగుతుందన్న ఉద్దేశంతో పోలీసులు వారిని నిలువరించారు.
ప్రభుత్వ లాంఛనాలపై ..
ఈ నేపథ్యంలో ఆయనకు అధికారిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఈ లాంఛనాలను వద్దని ముద్రగడ కుటుంబం స్పష్టం చేసింది. దీనిపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ముద్రగడ కుటుంబం నిర్ణయాన్ని సమర్థించగా.. మరికొంద రు మాత్రం.. అంతిమ సంస్కారాల విషయంలో రాజకీయాలు ఎందుకు..? అనే మాట అన్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు చాలా మంది సర్కారు లాంఛనాలపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. చివరకు వ్యక్తిగత లాంఛనాలతోనే కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది.
This post was last modified on July 15, 2026 7:48 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…