ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. బుధవారం మధ్యాహ్నం.. హైదరాబాద్లోని నివాసానికి చేరుకున్నారు. గత నాలుగు రోజుల కిందట ఆయన కుడి భుజానికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. కొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడిన ఆయన.. కొద్దిగా కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
అభిమానుల కోలాహలం..
పవన్ కల్యాణ్ డిశ్చార్జ్ అవుతున్నారన్నవార్త బయటకు రాగానే.. అభిమానులు పెద్ద సంఖ్యలో కోకిలా బెన్ ఆసుపత్రిని చుట్టుముట్టారు. పవన్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. స్థానిక బడా గణేష్ ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం.. పవన్ కల్యాణ్ కాన్వాయ్కు.. విమానాశ్రయం వరకు వీడ్కోలు పలికారు. తమ అభిమాన నాయకుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. జై పవన్ నినాదాలతో కోకిలా బెన్ ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది.
ఆసుపత్రి వైద్యులకు..
తనను కంటికి రెప్పలా చూసుకున్న ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి పవన్ కల్యాణ్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆపరేషన్ వైద్య బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్కు చేతులు జోడించి నమస్కరించి.. జ్ఞాపికను అందించారు. గత నాలుగు రోజులుగా తనకు ఆసుపత్రిలో సేవలు చేసిన సిబ్బందికి ప్రత్యేకంగా కానుకలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ముంబాయి మిఠాయి ప్యాకెట్లను పంపిణీ చేశారు. నగదు కూడా అందించారు.
చంద్రబాబు ఫోన్!
ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కొద్ది సేపటికి ముందు సీఎం చంద్రబాబు పవన్కు ఫోన్ చేశా రు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంతా బాగుంటేనే డిశ్చార్జ్ కావాలని లేకపోతే.. ఆసుపత్రి లోనే రెస్ట్ తీసుకోవాలని ఆయనకు సూచించారు. ఈ సమయంలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియ లు.. ప్రభుత్వం తరఫున వ్యవహరించాల్సిన తీరుపై కూడా ఇరువురు చర్చించారు.
This post was last modified on July 15, 2026 6:51 pm
తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో రోజుకో నాయకుడు ఏదోకటి మాట్లాడుతూ మీడియాకు చేతినిండా పని పెడుతున్నారు. ఒకరోజు కొండా సురేఖ, మరో…
కేవలం తొమ్మిది రోజుల్లో ది ప్యారడైజ్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన అంచనాలతో పాటు ఒత్తిడి కూడా అదే స్థాయిలో…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్…
రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…
గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…