Political News

వివేకాను చంపించింది జగనే: లోకేశ్

ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బాబాయిని జగన్ మోహన్ రెడ్డే చంపించాడు అంటూ లోకేశ్ చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వివేకా హత్య కేసులో జగన్ పాత్రపై పలుమార్లు పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేసిన లోకేశ్ తొలిసారిగా నేరుగా వివేకాను జగన్ చంపించాడు అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. కడపలో తాను పాదయాత్ర చేస్తున్నప్పుడే తాను ఈ విషయం చెప్పానని లోకేశ్ అన్నారు.

సొంత బాబాయ్ ను జగన్ లేపేశాడని, అయినా తప్పు కాదని అంటున్నాడని లోకేశ్ వ్యాఖ్యాచించారు. సింగయ్యను ఆయనే చంపేసినా తప్పుకాదని, వాళ్ల పార్టీకి చెందిన వాళ్లు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే తప్పు కాదని జగన్ అంటున్నారని లోకేశ్ విమర్శించారు.

ఇటువంటి వ్యక్తులున్న సమాజంలో మనం ఎక్కడికి పోతున్నాం అని ఆయన ప్రశ్నించారు. జగన్ కు ఆత్మలతో మాట్లాడే అలవాటుందని, ఒక్కోరోజు ఒక్కో ఆత్మతో మాట్లాడుతుంటారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఒకరోజు మావిగన్ అంటాడని, మరో రోజు బెంటాహై..బెంగుళూరు, తాడేపల్లి, హైదరాబాద్…ఇలా వారంలో ఆ మూడు చోట్లు కవర్ చేస్తుండాడు కాబట్టి అలా పిలిచానని చురకలంటించారు.

ఇలా రోజుకో రాజధాని అని చెబుతూ, గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాకుండా చేసిన జఫ్యా బ్యాచ్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నేతలను ఉద్దేశించి లోకేశ్ విమర్శించారు. లేదంటే ఏపీకి వచ్చే పెట్టుబడిదారులు కూడా రేపు రారని చెప్పారు. అందువల్ల ప్రజలు, నిరుద్యోగ యువత ఇబ్బందిపడతారని అన్నారు.

కడపలోని మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. దానితోపాటు కొండాపురం మండలంలో రూ.3,000 కోట్ల పెట్టుబడితో నిర్మించిన 600 మెగావాట్ల ఎస్ఏఈఎల్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను లోకేశ్ ప్రారంభించారు. ఆ సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on July 15, 2026 4:20 pm

Share

Recent Posts

ఏకగ్రీవాలు జరిగితే MLA టికెట్ ఇవ్వను: జగన్!

స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…

7 minutes ago

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

3 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

3 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

5 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

5 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

7 hours ago