Political News

అక్క రాజ్యం చూపిస్తానంటున్న కవిత

తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత విశ్వ‌రూపం చూపించారు. ప‌దునైన మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు. “ఇప్ప‌టి వ‌ర‌కు మీరు అన్న‌.. అన్న అంటూ అన్న‌రాజ్యం చూశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే.. అక్క‌రాజ్యం ఎలా ఉంటుందో చూపిస్తా.“ అంటూ.. త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. ఎవ‌రిని ఎక్క‌డ కూర్చోబెట్టాలో.. ఎవ‌రిని ఎంత‌గా గౌర‌వించాలో అంతా చేస్తామ‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. తాము అధికారంలోకి వ‌స్తే.. రాష్ట్రం స్వ‌రూపాన్నే మార్చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వంలో గౌర‌వ మ‌ర్యాద‌లు ద‌క్కేలా చేస్తామ‌న్నారు.

ప్ర‌స్తుతం ఎస్సీ, ఎస్టీల‌కు రాష్ట్రంలో ఏమాత్రం గౌర‌వం లేద‌ని క‌విత ఆరోపించారు. ఇది వేళ్లూనుకుపోయిన వ్య‌వ‌స్థ‌కు తార్కాణ‌మని పేర్కొన్నారు. దీనిని స‌మూలంగా మార్చేందుకు తాము ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. అక్క రాజ్యంలో ఎస్సీ, ఎస్టీలు స‌గౌర‌వంగా జీవించేందుకు వారికి ఉన్న హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించేందుకు, మ‌రిన్ని హ‌క్కులు క‌ల్పించేందుకు క‌ట్టుబ‌డి పాలిస్తామ‌న్నారు. రైతుల‌కు ఇప్పుడు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఆద‌ర‌ణా లేకుండా పోయింద‌ని, క‌నీసం వారిని కూర్చోబెట్టి మాట్లాడే సంస్కృతి కూడా దూర‌మైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ, తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. ప్ర‌తి కార్యాల‌యంలో ప్ర‌త్యేకంగా కుర్చీల‌ను ఏర్పాటుచేసి రైతుల‌ను గౌర‌విస్తామ‌న్నారు.

మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు క‌విత చెప్పారు. పాంచ‌జ‌న్యం పేరుతో తాము ప్ర‌క‌టించిన హామీలను అమ‌లు చేస్తామ‌న్నారు. ఉద్య‌మ కారుల కుటుంబాల‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు. `బాయిబాట‌` కార్య‌క్ర‌మంలో భాగంగా.. భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఆదివాసి గ్రామాల్లో క‌విత ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా ఆమె  స్థానిక గిరిజ‌నుల‌తో మ‌మేక‌మ‌య్యారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. క‌నీసం గిరిజ‌నుల‌కు ఒక చిన్న మోట‌రు సైకిలు కూడా లేద‌ని.. ఏ బ్యాంకూ వారికి రుణాలు ఇవ్వ‌డం లేద‌ని తెలిపారు. కార్పొరేట్ సంస్థ‌ల‌కు కేంద్రం హామీ ఉండి మ‌రీ అప్పులు ఇస్తోంద‌ని విమ‌ర్శించారు.

గిరిజనుల హక్కుల సాధన కోసమే టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన‌ట్టు క‌విత చెప్పారు. స‌మ‌స్య‌లు విన‌డ‌మే కాద‌ని.. ప‌రిష్క‌రించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు. గిరిజ‌న హ‌క్కుల సాధ‌న కోసం అవ‌స‌ర‌మైతే ఢిల్లీలో కూడా కొట్లాడుతాన‌ని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధుల‌ను దారి మ‌ళ్లిస్తున్నార‌ని ఆరోపించారు. వీటిని స‌క్ర‌మంగా ఖ‌ర్చుచేస్తే.. ఎస్సీ, ఎస్టీల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. తాను అంద‌రికోసమే రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని.. అంద‌రూ త‌న‌కుఅండ‌గా ఉండాల‌ని అక్క రాజ్యంకోసం ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని క‌విత పిలుపునిచ్చారు. 

Kumar

Recent Posts

సుకుమార్ వేసిన దారిలో ఎందరో

ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…

2 hours ago

దురంధర్ విలన్ ‘ఇక్కా’ ఎలా ఉంది

ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…

2 hours ago

ధనుష్ మురుగన్… త్రివిక్రమ్ రియాక్షన్ ఏంటో

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…

2 hours ago

‘భాగ్యశ్రీ’ భాగ్యరేఖ మారినట్టేనా

మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…

3 hours ago

‘భద్రాచలం రాముడి మీద ఆనా… ఈసారి కాంగ్రెస్ పార్టీకి 117!’

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చి తీరుతుంద‌న్నారు.…

4 hours ago

అఖిల్ క‌దిలిపోయాడు… క‌దిలించేశాడు

టాలీవుడ్లో చాలామంది వార‌సులు స‌క్సెస్ ఫుల్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. వారిలో కొంద‌రికి ఆరంభం నుంచే క‌లిసొచ్చింది. కొంద‌రు కాస్త త‌డ‌బ‌డి…

5 hours ago