జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు రాష్ట్రాల కన్నా దాని గురించి తమిళనాడులో ఎక్కువ చర్చ జరగడం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మురుగన్ / కుమారస్వామి మా దేవుళ్ళు అంటూ కోలీవుడ్ ఫాలోయర్స్, ట్విట్టర్ హ్యాండిల్స్ దీన్నో ఉద్యమంలా డిబేట్లు పెట్టారు. మాజీ మంత్రి ఒక అడుగు ముందుకేసి ఏకంగా సినిమాని రద్దు చేయాలని డిమాండ్ చేయడం వింత అనిపించింది.
ఇదిలా నడుస్తుండగానే ధనుష్ ఊహించని షాక్ ఇచ్చాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందే మూవీకి తమిళ్ మురుగన్ టైటిల్ పెట్టేసి ఒక ఏఐ వీడియో టీజర్ తయారు చేయించి ఆఘమేఘాల మీద అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసారు. ఈ కలయికలో వడ చెన్నై సీక్వెల్ ఉంటుందని కొన్ని నెలలుగా వార్తలు వస్తుండగా ఇప్పుడు హఠాత్తుగా ప్రకటన రావడం చూసి చెన్నై వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే ఈ బ్యాక్ డ్రాప్ లో ఎవరూ ఊహించని కలయిక ఇది.
కథ పరంగా తారక్ త్రివిక్రమ్ మూవీకి తమిళ మురుగన్ కి సంబంధం లేకపోవచ్చు. కానీ దేవుడికి సంబంధించిన ఎలిమెంట్ ఒకటే కాబట్టి ఖచ్చితంగా పోలిక వస్తుంది. కాకపోతే వీటిలో ధనుష్ సినిమానే ముందు రిలీజ్ అవుతుంది. ఎందుకంటే డ్రాగన్ రెండు భాగాలు రిలీజయ్యేలోపు 2028 వచ్చేస్తుంది. ఆదర్శ కుటుంబం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ కోసం త్రివిక్రమ్ కొంత సమయం తీసుకోబోతున్నారు. సో రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం నుంచి ఉంటుంది.
ఇప్పుడీ ట్విస్టు తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. నిర్మాత నాగవంశీ తన ట్వీట్ లో మురుగన్ ఉత్తరాదిలో పుట్టారని ప్రస్తావించడం నుంచి ఇప్పుడీ అనౌన్స్ మెంట్ దాకా సినిమా తరహాలో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం శింబుతో అరసన్ పూర్తి చేసే పనిలో ఉన్న వెట్రిమారన్ మాములుగా అయితే వేగంగా సినిమాలు తీసే రకం కాదు. కానీ తమిళ మురుగన్ మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇంకో ఏడాదిలో రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట.
This post was last modified on July 10, 2026 11:47 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…