“ఇరాన్ను మసి చేస్తాం.. బుగ్గి చేస్తాం“ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అస్తిత్వం ఇక, చరిత్రలో చదువుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక, ఆ దేశంతో చర్చలు అనే మాట కూడా ఎత్తేది లేదన్నారు. ఇరాన్ పాలకులను ఈ సందర్భంగా ఆయన క్రూరులుగా అభివర్ణించారు. వారు.. ఈ ప్రపంచంలో జీవించేందుకు అర్హులు కాదని వ్యాఖ్యానించారు. ఇకపై ఎలాంటి హెచ్చరిక లు లేకుండానే ఇరాన్పై దాడి చేయనున్నట్టు చెప్పారు.
ఏం జరిగింది?
శాంతి ఒప్పందం నేపథ్యంలో పశ్చిమాసియాలోని హోర్ముజ్ జలసంధిగుండా అమెరికా నౌకలు ప్రయాణిస్తున్నాయి. అయితే.. ఒప్పందం అడ్డు పెట్టుకుని తమ జలాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఇరాన్ సైన్యం అమెరికాకు చెందిన మూడు వాణిజ్య నౌకలపై దాడి చేసి.. వాటిని నీటమునిగేలా చేసింది. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన ట్రంప్.. ఆగ్రహోదగ్రులయ్యారు. ఇరాన్ను క్షమించేది లేదని పేర్కొన్నా రు. శాంతి ఒప్పందం కూడా ముగిసిందని, ఇక, చర్చలు అనే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
“ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోంది. చర్చల పేరుతో టైమ్ వృథా చేస్తోంది. ఇకపై ఎలాంటి చర్యలు ఉండవు. ఆదేశాన్ని నాశనంచేస్తాం. బుగ్గి చేస్తాం. ఏరుకునేందుకు ఎముకలు కూడా లేకుండా చేస్తాం.“ అని హెచ్చరించారు. ఆయన హెచ్చరించే సరికే.. అమెరికా సైనికులు ఇరాన్లోని పలు ప్రాంతాలపై దాడు లు చేశారు. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఉపేక్షించేది లేదన్నారు.
ప్రపంచం గగ్గోలు!
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రపంచ దేశాలు మరోసారి గగ్గోలు పెట్టాయి. ఇప్పుడి ప్పుడే పరిస్థితి దారిలోకి వస్తోందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఇరాన్పై అమెరికా విరుచుకుప డడం.. ప్రతిగా ఇరాన్ కూడా దాడులు ముమ్మరం చేయడంతో హోర్ముజ్పై ఈ ప్రభావం ఎక్కువగా పడు తోంది. ఫలితంగా మరోసారి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం కావడం గమనార్హం.
మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేసి మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి మెగా ఫ్యాన్స్ ని…
తెలంగాణలో గంజాయి సాగు, రవాణా, వాడకం గతంతో పోలిస్తే చాలా పెరిగిన సంగతి తెలిసిందే. గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టేందుకు…
నాగ చైతన్య గత సినిమా తండేల్ వచ్చి పదిహేడు నెలలు గడిచిపోయాయి. మళ్ళీ తనను తెరమీద చూసే ఛాన్స్ అభిమానులకు…
ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా…ఈ ఇద్దరి జోడీ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే.…
పైకి ఏదో టాలీవుడ్ వెలిగిపోతోందని అనుకోవడమే కానీ ఇండస్ట్రీ డొల్లతనాలు, నిర్మాతల కష్టనష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా కరోనా…
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయగడ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండడంతో…