“ఇరాన్ను మసి చేస్తాం.. బుగ్గి చేస్తాం“ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అస్తిత్వం ఇక, చరిత్రలో చదువుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక, ఆ దేశంతో చర్చలు అనే మాట కూడా ఎత్తేది లేదన్నారు. ఇరాన్ పాలకులను ఈ సందర్భంగా ఆయన క్రూరులుగా అభివర్ణించారు. వారు.. ఈ ప్రపంచంలో జీవించేందుకు అర్హులు కాదని వ్యాఖ్యానించారు. ఇకపై ఎలాంటి హెచ్చరిక లు లేకుండానే ఇరాన్పై దాడి చేయనున్నట్టు చెప్పారు.
ఏం జరిగింది?
శాంతి ఒప్పందం నేపథ్యంలో పశ్చిమాసియాలోని హోర్ముజ్ జలసంధిగుండా అమెరికా నౌకలు ప్రయాణిస్తున్నాయి. అయితే.. ఒప్పందం అడ్డు పెట్టుకుని తమ జలాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఇరాన్ సైన్యం అమెరికాకు చెందిన మూడు వాణిజ్య నౌకలపై దాడి చేసి.. వాటిని నీటమునిగేలా చేసింది. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన ట్రంప్.. ఆగ్రహోదగ్రులయ్యారు. ఇరాన్ను క్షమించేది లేదని పేర్కొన్నా రు. శాంతి ఒప్పందం కూడా ముగిసిందని, ఇక, చర్చలు అనే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
“ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోంది. చర్చల పేరుతో టైమ్ వృథా చేస్తోంది. ఇకపై ఎలాంటి చర్యలు ఉండవు. ఆదేశాన్ని నాశనంచేస్తాం. బుగ్గి చేస్తాం. ఏరుకునేందుకు ఎముకలు కూడా లేకుండా చేస్తాం.“ అని హెచ్చరించారు. ఆయన హెచ్చరించే సరికే.. అమెరికా సైనికులు ఇరాన్లోని పలు ప్రాంతాలపై దాడు లు చేశారు. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఉపేక్షించేది లేదన్నారు.
ప్రపంచం గగ్గోలు!
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రపంచ దేశాలు మరోసారి గగ్గోలు పెట్టాయి. ఇప్పుడి ప్పుడే పరిస్థితి దారిలోకి వస్తోందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఇరాన్పై అమెరికా విరుచుకుప డడం.. ప్రతిగా ఇరాన్ కూడా దాడులు ముమ్మరం చేయడంతో హోర్ముజ్పై ఈ ప్రభావం ఎక్కువగా పడు తోంది. ఫలితంగా మరోసారి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం కావడం గమనార్హం.
This post was last modified on July 9, 2026 3:09 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…