“ఇరాన్ను మసి చేస్తాం.. బుగ్గి చేస్తాం“ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అస్తిత్వం ఇక, చరిత్రలో చదువుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక, ఆ దేశంతో చర్చలు అనే మాట కూడా ఎత్తేది లేదన్నారు. ఇరాన్ పాలకులను ఈ సందర్భంగా ఆయన క్రూరులుగా అభివర్ణించారు. వారు.. ఈ ప్రపంచంలో జీవించేందుకు అర్హులు కాదని వ్యాఖ్యానించారు. ఇకపై ఎలాంటి హెచ్చరిక లు లేకుండానే ఇరాన్పై దాడి చేయనున్నట్టు చెప్పారు.
ఏం జరిగింది?
శాంతి ఒప్పందం నేపథ్యంలో పశ్చిమాసియాలోని హోర్ముజ్ జలసంధిగుండా అమెరికా నౌకలు ప్రయాణిస్తున్నాయి. అయితే.. ఒప్పందం అడ్డు పెట్టుకుని తమ జలాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఇరాన్ సైన్యం అమెరికాకు చెందిన మూడు వాణిజ్య నౌకలపై దాడి చేసి.. వాటిని నీటమునిగేలా చేసింది. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన ట్రంప్.. ఆగ్రహోదగ్రులయ్యారు. ఇరాన్ను క్షమించేది లేదని పేర్కొన్నా రు. శాంతి ఒప్పందం కూడా ముగిసిందని, ఇక, చర్చలు అనే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
“ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోంది. చర్చల పేరుతో టైమ్ వృథా చేస్తోంది. ఇకపై ఎలాంటి చర్యలు ఉండవు. ఆదేశాన్ని నాశనంచేస్తాం. బుగ్గి చేస్తాం. ఏరుకునేందుకు ఎముకలు కూడా లేకుండా చేస్తాం.“ అని హెచ్చరించారు. ఆయన హెచ్చరించే సరికే.. అమెరికా సైనికులు ఇరాన్లోని పలు ప్రాంతాలపై దాడు లు చేశారు. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఉపేక్షించేది లేదన్నారు.
ప్రపంచం గగ్గోలు!
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రపంచ దేశాలు మరోసారి గగ్గోలు పెట్టాయి. ఇప్పుడి ప్పుడే పరిస్థితి దారిలోకి వస్తోందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఇరాన్పై అమెరికా విరుచుకుప డడం.. ప్రతిగా ఇరాన్ కూడా దాడులు ముమ్మరం చేయడంతో హోర్ముజ్పై ఈ ప్రభావం ఎక్కువగా పడు తోంది. ఫలితంగా మరోసారి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం కావడం గమనార్హం.
This post was last modified on July 9, 2026 3:09 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…