Political News

గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులే బెటర్

తెలంగాణలో గంజాయి సాగు, రవాణా, వాడకం గతంతో పోలిస్తే చాలా పెరిగిన సంగతి తెలిసిందే. గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఈగల్ టీం, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. ఈ క్రమంలోనే అందుకు గల కారణాలను వివరించే క్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు తగ్గడం వల్లే గంజాయి సాగు పెరిగిందని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

గతంలో గంజాయి పండించి సరఫరా చేసే ప్రాంతాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలని ఆనంద్ చెప్పారు. గంజాయి స్మగ్లర్లు, గంజాయి పండించే వారి పట్ల మావోయిస్టులు కఠినంగా వ్యవహరించేవారని తెలిపారు. మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గడంతో మళ్లీ గంజాయి ధందా పెరిగిందని అన్నారు.

గంజాయి పండించి, అమ్మేవారిని మావోయిస్టులు శిక్షించేవారని, అయితే, మావోయిస్టులు తగ్గిపోవడంతో గంజాయి రవాణా పెరిగిందని, ఇలా విస్తరించిందని ఆనంద్ చెప్పారు. గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులే బెటర్‌ అని ఆనంద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గ్రేహౌండ్స్ దళాలను వేరే పనికి వాడతామని, అయినా వాళ్లొక్కరే గంజాయి సాగు, రవాణా అరికట్టలేరని చేయలేరని చెప్పారు. జిల్లా పోలీసులు, ఈగల్ టీంలు కలిసి గంజాయి సాగు, రవాణా అరికట్టాలని అన్నారు. మాదకద్రవ్యాలతో దేశానికి, రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందని, వీటికి అలవాటు పడితే యువత భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడతామని హెచ్చరించారు.

This post was last modified on July 9, 2026 4:01 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago