తెలుగులో కేవలం నటనకు పరిమితం కాకుండా.. రైటింగ్, మేకింగ్లోనూ భాగం అవుతూ తన సినిమాలను సక్సెస్ చేసుకునే హీరోల్లో నవీన్ పొలిశెట్టి ఒకడు. తన కెరీర్ను మలుపు తిప్పిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మొదలుకుని.. ప్రతి సినిమాలోనూ తన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ముఖ్యంగా తన చివరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విషయంలో అతనెంత ఇన్వాల్వ్ అయ్యాడో తెలిసిందే.
ఈ సినిమాను డైరెక్ట్ చేసిన మారి గురించి ఎవ్వరూ మాట్లాడుకోలేదు. ఆ తమిళ కుర్రాడు పేరుకే దీనికి దర్శకుడిగా ఉన్నాడు.. అన్నీ చూసుకుంది నవీనే అని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లే సక్సెస్ క్రెడిట్ అంతా నవీన్ ఖాతాలోకే వెళ్లింది. కట్ చేస్తే ఇప్పుడు మరో తమిళ దర్శకుడితో నవీన్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడి పేరు.. ఆంటోనీ భాగ్యరాజ్.
తమిళంలో జయం రవి హీరోగా ‘సైరెన్’ చిత్రంతో ఆంటోనీ దర్శకుడిగా మారాడు. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ.. దర్శకుడిగా ఆంటోనీని కొంత పేరొచ్చింది. ఇంకా ఈ దర్శకుడు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించలేదు. ఐతే అతను నవీన్తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. నవీన్తో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తీసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనుందట.
ఆ సంస్థ అధినేతలతో నవీన్కు మంచి అనుబంధం ఉంది. ఇటీవల నవీన్ పంచుకున్న ఒక సరదా వీడియోలో మైత్రీ అధినేతలు కనిపించారు. ఆ వీడియో పంచుకుంటూ తన తర్వాతి సినిమా గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తానని ప్రకటించాడు నవీన్. ఆ ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిగ్గా ఈ సినిమా స్క్రిప్టులోనూ నవీన్ ఇన్వాల్వ్ అవుతాడనడంలో సందేహం లేదు. ‘అనగనగా ఒక రాజు’కు నవీన్తో కలిసి స్క్రిప్టు రాసిన చిన్మయి ఘాట్రాజు కూడా ఇందులో భాగం కావచ్చు.
This post was last modified on June 27, 2026 1:50 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…