ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సాయికృష్ణ తల్లి, మేనమామ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీనిచ్చారని, తనకు భరోసా కల్పించారని సాయికృష్ణ తల్లి తెలిపారు. తనకు అది చాలని ఆమె అన్నారు. తాను సీఎం చంద్రబాబును కలవాలని అనుకున్నానని, తన బిడ్డ కేసులో న్యాయం చేశారని తెలిపారు. తనకు ఏ సాయం కావాలన్నా చేస్తానని చంద్రబాబు భరోసానిచ్చారని చెప్పారు.
ఒక సామాన్యుడికి న్యాయం జరగదనుకున్నామని, కానీ, సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తానని భరోసానిచ్చారని, తమకు అంతకన్నా ఏం కావాలని సాయికృష్ణ మేనమామ అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వంటి మహోన్నత వ్యక్తులున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సాయికృష్ణకు అన్యాయం చేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపిస్తామని చంద్రబాబు హామీనిచ్చారని తెలిపారు.
సాయికృష్ణ తల్లి బాధను చంద్రబాబు విన్నారని, ఆమెకు ఆయన భరోసానిచ్చారని, తమకు అంతకన్నా ఇంకేం అవసరం లేదని అన్నారు. తమ బాధలు చంద్రబాబుతో చెప్పుకున్నామని, వాటిని చంద్రబాబు సావధానంగా విన్నారని అన్నారు. తమకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో మరెవరికి జరగకూడదని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.
This post was last modified on June 19, 2026 7:49 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…