ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సాయికృష్ణ తల్లి, మేనమామ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీనిచ్చారని, తనకు భరోసా కల్పించారని సాయికృష్ణ తల్లి తెలిపారు. తనకు అది చాలని ఆమె అన్నారు. తాను సీఎం చంద్రబాబును కలవాలని అనుకున్నానని, తన బిడ్డ కేసులో న్యాయం చేశారని తెలిపారు. తనకు ఏ సాయం కావాలన్నా చేస్తానని చంద్రబాబు భరోసానిచ్చారని చెప్పారు.
ఒక సామాన్యుడికి న్యాయం జరగదనుకున్నామని, కానీ, సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తానని భరోసానిచ్చారని, తమకు అంతకన్నా ఏం కావాలని సాయికృష్ణ మేనమామ అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వంటి మహోన్నత వ్యక్తులున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సాయికృష్ణకు అన్యాయం చేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపిస్తామని చంద్రబాబు హామీనిచ్చారని తెలిపారు.
సాయికృష్ణ తల్లి బాధను చంద్రబాబు విన్నారని, ఆమెకు ఆయన భరోసానిచ్చారని, తమకు అంతకన్నా ఇంకేం అవసరం లేదని అన్నారు. తమ బాధలు చంద్రబాబుతో చెప్పుకున్నామని, వాటిని చంద్రబాబు సావధానంగా విన్నారని అన్నారు. తమకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో మరెవరికి జరగకూడదని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.
This post was last modified on June 19, 2026 7:49 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…