ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సాయికృష్ణ తల్లి, మేనమామ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీనిచ్చారని, తనకు భరోసా కల్పించారని సాయికృష్ణ తల్లి తెలిపారు. తనకు అది చాలని ఆమె అన్నారు. తాను సీఎం చంద్రబాబును కలవాలని అనుకున్నానని, తన బిడ్డ కేసులో న్యాయం చేశారని తెలిపారు. తనకు ఏ సాయం కావాలన్నా చేస్తానని చంద్రబాబు భరోసానిచ్చారని చెప్పారు.
ఒక సామాన్యుడికి న్యాయం జరగదనుకున్నామని, కానీ, సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తానని భరోసానిచ్చారని, తమకు అంతకన్నా ఏం కావాలని సాయికృష్ణ మేనమామ అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వంటి మహోన్నత వ్యక్తులున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సాయికృష్ణకు అన్యాయం చేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపిస్తామని చంద్రబాబు హామీనిచ్చారని తెలిపారు.
సాయికృష్ణ తల్లి బాధను చంద్రబాబు విన్నారని, ఆమెకు ఆయన భరోసానిచ్చారని, తమకు అంతకన్నా ఇంకేం అవసరం లేదని అన్నారు. తమ బాధలు చంద్రబాబుతో చెప్పుకున్నామని, వాటిని చంద్రబాబు సావధానంగా విన్నారని అన్నారు. తమకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో మరెవరికి జరగకూడదని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…