తమపై తాత్కాలిక నిషేధం ఎత్తివేయాలని.. ఉద్దేశ పూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం తమపై నిషేధం విధించిందని ఆరోపిస్తూ.. టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ఈ కేసు విచారణకు వచ్చింది. దీనిపై వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. ప్రస్తుత పరిస్థితిలో నిషేధం అనేది చిన్న చర్యేనని వ్యాఖ్యానించింది. నీట్ ప్రశ్న పత్రాలు లీకైతే.. ఎవరు బాద్యత వహిస్తారని ప్రశ్నించింది.
తాత్కాలిక నిషేధం వెనుక.. ఎలాంటి ఉద్దేశ పూర్వక చర్యలు కనిపించడం లేదని అభిప్రాయపడిన కోర్టు.. కేంద్రం తీసుకున్న చర్య ఆమోదయోగ్యమేనని పేర్కొంది. వైద్య విద్యా ప్రవేశాలకు సంబంధించి గత నెలలో నిర్వహించిన నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దేశాన్ని కుదిపేసిన నేపథ్యంలో మరోసారి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు నిషేధం విధించింది.
అయితే.. తమపై నిషేధం విధించడం వెనుక మెటా, వాట్సాప్ వంటి సంస్థలు ఉన్నాయని.. వాటిపై లేని నిషేధం తమపై ఎందుకని పేర్కొంటూ.. టెలిగ్రామ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. తమపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వాదనలను కోర్టు పరిగణన లోకి తీసుకుంది. గత నెలలో నిర్వహించిన నీట్ ప్రశ్నపత్రం.. టెలిగ్రామ్ యాప్ ద్వారా లీకైందని అధికారులు పేర్కొన్నట్టు తెలిపింది. మోసపూరిత నెట్ వర్కులతోపాటు.. ఇతర అనుమానిత నెట్ వర్క్లపై నిషేధం విధించామని పేర్కొంది.
ఈ నిషేధం కేవలం ఈ నెల 22వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటుందని కేంద్రం వివరించింది. నీట్ సమస్యలు రాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. టెలిగ్రామ్ యాప్ పై ఎలాంటి దురుద్దే శాలు లేవని కోర్టుకు వివరించింది. ఏ నెట్వర్క్పైనైనా కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు కూడా కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించింది. నిషేధం అమలు కొనసాగుతుందని పేర్కొంది.
This post was last modified on June 20, 2026 9:48 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…