Political News

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని విపక్ష వైసీపీ ఆరోపిస్తుంటే… ఈ వ్యవహారంలో వైసీపీ చెబుతున్నవన్నీ అసత్యాలేనని అధికార కూటమి పార్టీల నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అదినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం నేరుగా సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. సాయి తల్లి విజయలక్ష్మిని ఆయన ఓదార్చారు. సాయి వ్యవహారంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేసిన జగన్… ఈ ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారం అంతకంతకూ జఠిలం అవుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం జగన్ నేరుగా సాయి ఇంటికి వెళ్లారు. సాయి తల్లిని ఓదార్చిన జగన్…ఈ విషయంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కష్టకాలంలో మీకు అండగా ఉంటామని ఆయన ఆమెకు హామీ ఇచ్చారు. ఈ ఘటనలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సాయి ఇంటి ముందే మీడియాతో మాట్లాడారు. సాయి కుటుంబానికి న్యాయం జరగాలంటే ఈ వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా జగన్ ఆసక్తికర కామెంట్లు చేశారు. సాయికృష్ణ వ్యవహారంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్న నాగరాజును సస్సెండ్ చేశారంటేనే… తప్పు జరిగిపోయిందని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా అని ఆయన అన్నారు. తన కుమారుడి ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించిన విజయలక్ష్మికి కనీస స్పందన కూడా లభించకపోవడం దారుణమన్నారు. సాయి తల్లి ఫిర్యాదును డీజీపీ కార్యాలయం చెత్తబుట్టలో దాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. కోర్టుకు వెళితే గానీ సాయి తల్లి ఆవేదనను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఏపీలో ఉన్న పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని ఆయన అన్నారు.

ఇక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం దానికి కాకినాడ జిల్లా ఎస్పీని విచారణాధికారిగా నియమించిన తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి వ్యవహారంలో సీఐ స్థాయి నుంచి ఏసీపీ, సీపీ..చివరకు డీజీపీకి కూడా పాత్ర ఉందన్న జగన్.. ఇంత పెద్ద స్థాయి పోలీసు అధికారులకు పాత్ర ఉన్న ఈ కేసు దర్యాప్తును ఓ ఎస్పీ స్థాయి అధికారికి కట్టబెట్టడంతోనే ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో ఇట్టే అర్ధం అయిపోతోందన్నారు. ఈ వ్యవహారంలో హోం మంత్రితో పాటు సీఎం చంద్రబాబుకూ పాత్ర ఉందని కూడా జగన్ సంచలన ఆరోపణలు గుప్పించారు. మొత్తంగా సాయి ఇంటికి జగన్ వెళ్లడం, ఈ వ్యవహారంపై ఆయన సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

This post was last modified on June 18, 2026 9:24 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

27 minutes ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

40 minutes ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

49 minutes ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

2 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

2 hours ago

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

3 hours ago