విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ యువకుడిపై పలు కేసులున్నాయని, ఈ క్రమంలోనే మే 9వ తేదీన అతడిని పోలీసులు తీసుకుపోయారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఆ యువకుడు ఇంటికి రాలేదని, ఆ యువకుడు లాకప్ డెత్ కావడంతో పోలీసులే అతడి శవాన్ని తగులబెట్టారని కొందరు వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
అంతేకాదు, ఆ యువకుడు జనసేన కార్యకర్త అని, ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.
ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి నిష్పక్షపాతంగా నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ తర్వాత తనకు సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీఐను వీఆర్ కు పంపామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
This post was last modified on June 17, 2026 8:09 pm
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…