విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ యువకుడిపై పలు కేసులున్నాయని, ఈ క్రమంలోనే మే 9వ తేదీన అతడిని పోలీసులు తీసుకుపోయారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఆ యువకుడు ఇంటికి రాలేదని, ఆ యువకుడు లాకప్ డెత్ కావడంతో పోలీసులే అతడి శవాన్ని తగులబెట్టారని కొందరు వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
అంతేకాదు, ఆ యువకుడు జనసేన కార్యకర్త అని, ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.
ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి నిష్పక్షపాతంగా నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ తర్వాత తనకు సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీఐను వీఆర్ కు పంపామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…