ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్ 12) నాటికి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ రెండేళ్ల కాలంలో వైసీపీ అధినేత జగన్ ఏం చేశారు? అనేది ముఖ్యం. ప్రభుత్వం పరంగా గెలిచినా ఓడినా.. ఎమ్మెల్యేగా అసెంబ్లీని గౌరవించాలి. అసెంబ్లీకి రావాలి. సమస్యలపై ఎలుగెత్తాలి. మరీ ముఖ్యంగా మాజీ సీఎంగా ఆయనకు ఉండే బాధ్యత నెరవేర్చాలి.
కానీ, జగన్ ఈ విషయంలో పూర్తిగా వెనుకబడ్డారు. పొరుగున ఉన్న తమిళనాడులో 193 స్థానాలతో విజయం దక్కించుకుని ప్రభుత్వాన్ని చలాయించిన స్టాలిన్.. ఈ ఏడాది ఎన్నికల్లో 57 స్థానాలకు పడిపోయారు. అయినా.. ఆయన ప్రజలను వదిలి పెట్టలేదు. ఓడాం కదా.. అని ఇంట్లో కూర్చోలేదు. ఎన్నికల ఫలితం వచ్చిన మర్నాడే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నారు. మరి జగన్ విషయంలో ఏం జరిగింది? ఆయన ఓటమిని అంగీకరించలేక పోతున్నారా? ప్రజలను అవమానిస్తున్నారా? అనేది కీలకం.
ఇక, పార్టీ పరంగా కూడా ఆయన యాక్టివ్గా ఉండడం లేదు. ఇప్పటి వరకు విపక్ష నేతగా ఒక్క బహిరంగ సభ నిర్వహించలేక పోయారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం వినిపించలేక పోయారు. తాడేపల్లి నివాసంలో మీడియా సమావేశాలకు మాత్రమే ఆయన పరిమితం అయ్యారు. ఇవన్నీ… మైనస్లు. ఇక, మరీ ముఖ్యంగా ఇప్పటికీ.. పేపర్ చూడకుండా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఇది మరింత దారుణంగా జగన్ను డైల్యూట్ చేస్తోంది.
అన్ని విషయాలపై అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. కానీ, ఐదేళ్ల ముఖ్యమంత్రిగా.. రాష్ట్రంపై పట్టు ఉంటుంది. ఉండాలి కూడా. కానీ.. ఈ విషయంలోపై విఫలమయ్యారు. ఇప్పటికీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టునే ఆయన చదువుతున్నారు.
మరోముఖ్య విషయం.. తన పాలన బాగుందని పదే పదే చెప్పడం.. అయితే.. సహజంగా ఎవరైనా ఇదే చెబుతారని అనుకుంటే పొరపాటు. గతంలో తప్పులను ఒప్పుకోరు. జగన్ ఇదే చేసి నవ్వుల పాలవుతున్నారు. మూడు రాజధానుల నుంచి మావిగన్ వరకు వచ్చారు. ఇవన్నీ.. ఈ రెండేళ్లలో జగన్కు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చకపోగా.. మరింతగా ఆయన ఇమేజ్ను దెబ్బతీశాయన్నది వాస్తవం.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…