మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది. మరో డీఎస్సీకి, టెట్కు అభ్యర్థులు సిద్ధమవుతున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ డీఎస్సీ నిర్వహణ, ఎంపికపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో డీఎస్సీలో ఉద్యోగాలు రాని అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన జగన్, ఈరోజు ప్రెస్మీట్ పెట్టి డీఎస్సీ ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ జరిగి 9 నెలలు పూర్తయ్యేంతవరకు వైసీపీ దీనిపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. ఇందులో అక్రమాలు జరిగాయంటూ గత నెలలో జగన్ అనుకూల మీడియా పలు కథనాలను ప్రచురించింది. ఇంతసేపు ఆగి ఒక్కసారిగా ఎటాక్ చేయడం వ్యూహాత్మకమని పలువురు భావిస్తున్నారు.
డీఎస్సీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది తెరపైకి వచ్చారు. వారంతా వైఎస్ జగన్ను కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణపై పూర్తి వివరణ ఇచ్చింది. అయినా కూడా వైఎస్సార్సీపీ ఆందోళనలు ఆపలేదు. జిల్లా కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు కొంతమంది అభ్యర్థులతో కలిసి ఆందోళనలు చేపట్టారు.
స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టుల భర్తీలో నిబంధనలు ఉల్లంఘించారని, జీవోలను మార్చడం ద్వారా తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నవారికి లబ్ధి చేకూర్చారని మాజీ మంత్రి పేర్ని నాని వంటి సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం రాని నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకుని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశంతోనే ఈ పేపర్ లీక్, అక్రమాల అస్త్రాన్ని ఆ పార్టీ ప్రయోగించిందని భావిస్తున్నారు.
ఈరోజు ప్రెస్మీట్లో జగన్ మాట్లాడుతూ, ‘మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు? మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు? డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత భద్రతతో జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు’ అని ఆయన ఆరోపించారు.
దీంతోపాటు పలు అంశాలను ఆయన లేవనెత్తారు. గతంలో వైఎస్ జగన్ను అభ్యర్థులు కలిసిన సమయంలో నారా లోకేష్ మాస్కో పర్యటనలో ఉన్నారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ అందుబాటులోనే ఉన్నారు. జగన్ చేసిన తీవ్ర ఆరోపణలపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇవాళ అల్లరి నరేష్ పుట్టినరోజు. ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు ఒక్కొక్కటిగా గ్రీటింగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో కొత్త…
మాస్ హీరోయిజంలో కామెడీ మిక్స్ చేసి మెప్పించడంలో రవితేజకు సాటి రావడం అంత ఈజీ కాదు. తన ముద్రని మ్యాచ్…
నిన్న జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ప్రకటన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయ వ్యక్తీకరణ జరుగుతోంది.…
టాలీవుడ్ నుంచి మరో మెగా మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న గాడ్ ఆఫ్ వార్…
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…