ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణపై కాంగ్రెస్ నేతల వైఖరిని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో తనను అడుగు పెట్టొద్దని అన్నారని చెప్పిన ఆయన.. అలాంటప్పుడు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఉత్తరాదికి చెందిన నాయకుడు కాబట్టి.. ఆయన కూడా తెలంగాణ సహా.. దక్షిణాది రాష్ట్రాల్లోకి రాకూడదని వ్యాఖ్యానించారు. అయితే.. తాను అలా చెప్పే వ్యక్తిని కాదన్నారు. సువిశాల భారత దేశంలో ఎవరు ఎక్కడినుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చని.. నివసించొచ్చని రాజ్యాంగమే చెబుతోందని తెలిపారు. ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్..ఓ జాతీయ మీడియా పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.
రేవంత్కు చురకలు..
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పరోక్షంగా చురకలు అంటించారు. ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నవారే.. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు అంటూ.. గోడలు కట్టుకుంటున్నారని పవన్ వ్యాఖ్యానించారు. కానీ, ఇది ఆ స్థాయిలో ఉన్న నాయకులకు సరైన విధానం కాదన్నారు. 550 సంస్థాలను ఏకం చేసి.. ఏర్పరుచుకున్న దేశంలో నాది.. నీది అంటూ ఏమీ ఉండదని.. అన్నీ అందరివీ అనే భావన ముఖ్యమని చెప్పారు. ఇలా మాట్లాడుతున్న సీఎంలు సరిచేసుకోవాలని సూచించారు. అంతేకాదు.. తాను తెలంగాణలోకి రావాలని.. పార్టీని విస్తరించాలని అనుకోవడం లేదన్నారు. కానీ, తన పార్టీ కార్యకర్తలు కోరితే.. వచ్చానన్నారు.
తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తుల్లో తానే ముందుంటానని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను తెలంగాణకు వ్యతిరేకమని కొందరు ప్రచారం చేస్తున్నారని.. కానీ, ఇది తప్పని చెప్పారు. తాను తెలంగాణ ఏర్పాటుకు ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. కానీ.. విభజన జరిగిన తీరును మాత్రమే తాను విమర్శించానని తెలిపారు.
చెప్పే మాటల్లో చేసే పనుల్లో హేతు బద్ధత అత్యంత ముఖ్యమని.. అలాంటి వారినే నేటి యువత కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ యువతకు చాలానే ఆకాంక్షలు ఉన్నాయని.. వారు సరైన నేత కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పార్టీని విస్తరించేందుకు దృష్టి పెడతామని తెలిపారు. తాను ఎవరికీ… వ్యతిరేకం కాదన్నారు. జాతీయ భావాలను నేటి యువత తెలుసుకోవాలని ఆయన సూచించారు.
This post was last modified on June 10, 2026 10:35 pm
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…