ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్ననాటి నుంచి తన పేరు ఎలా మారుతూ వచ్చిందో, ‘పవన్’ అనే పదం తన పేరులో ఎలా చేరిందో వివరించారు. తన అసలు పేరు ‘శ్రీ కల్యాణ్ కుమార్’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
తిరుమలలోని యోగ నరసింహస్వామి ఆలయంలో నామకరణం సందర్భంగా ఆ పేరు పెట్టారని చెప్పారు. అయితే పాఠశాల రికార్డుల్లో ‘శ్రీ’ అనే పదాన్ని నమోదు చేయకపోవడంతో పేరు ‘కల్యాణ్ కుమార్’గా మారిందన్నారు. అనంతరం ఇంటి పేరుతో కలిసి ‘కొణిదెల కల్యాణ్ కుమార్’, తర్వాత ‘కె. కల్యాణ్ కుమార్’గా కొనసాగిందని వివరించారు.
సినీ రంగంలోకి రాకముందు తాను మార్షల్ ఆర్ట్స్లో కఠిన శిక్షణ పొందేవాడినని చెప్పారు. ఆ సమయంలో తన శారీరక దారుఢ్యాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక సాధన చేసేవాడినని, ఛాతీపై వందల కిలోల బరువును ఉంచి విన్యాసాలు చేయడంతో పాటు రాతి పలకలను కూడా పగలగొట్టేవారని గుర్తుచేసుకున్నారు.
తన సామర్థ్యాన్ని చూసిన మార్షల్ ఆర్ట్స్ గురువుల్లో ఒకరు హనుమంతుడితో పోల్చుతూ “నువ్వు పవనపుత్ర హనుమంతుడిలా ఉన్నావు” అని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత తన పేరుకు ‘పవన్’ అనే పదాన్ని జోడించారని, అప్పటి నుంచి ‘పవన్ కల్యాణ్’ అనే పేరు స్థిరపడిందన్నారు. సినీ రంగంలోకి అడుగుపెట్టకముందే ఈ పేరు తనకు వచ్చిందని, తర్వాత అదే తన ప్రత్యేక గుర్తింపుగా మారిందని చెప్పారు.
మార్షల్ ఆర్ట్స్పై పవన్ కల్యాణ్కు ఉన్న ఆసక్తి కేవలం సాధనకే పరిమితం కాలేదు. జపాన్కు చెందిన సంప్రదాయ యుద్ధకళలు, సమురాయ్ సంస్కృతిపై కూడా ఆయన లోతైన అధ్యయనం చేశారు. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గదర్శకత్వంలో ‘కెండో’లో ఉన్నత స్థాయి శిక్షణ పొందారు.
ఈ క్రమంలో సాంకేతిక నైపుణ్యంతో పాటు యుద్ధకళల తాత్విక అంశాలపైనా అవగాహన పెంపొందించుకున్నారు. ఇటీవల జపాన్కు చెందిన ప్రతిష్ఠాత్మక యుద్ధకళల సంస్థ ‘సాగో బుడో కన్రికై’ ఆయనకు ‘ఫిఫ్త్ డాన్’ గౌరవాన్ని ప్రదానం చేసింది. అలాగే జపాన్ వెలుపల ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు సాధించారు.
మరోవైపు ‘గోల్డెన్ డ్రాగన్స్’ సంస్థ పవన్ కల్యాణ్ను ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ బిరుదుతో సత్కరించింది. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా యుద్ధకళల సాధకుడిగా కూడా పవన్ కల్యాణ్ ప్రత్యేక గుర్తింపు పొందడం విశేషం.
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…
ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…