పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు మరో వీకెండ్ దొరికనుంది. సెకండ్ సాటర్డే సెలవుతో పాటు ఆదివారం కలిసి రానుంది. శనివారంతో టికెట్ రేట్ల పెంపు రెండు రాష్ట్రాల్లో ముగింపుకొస్తుంది. అంటే సన్ డే నుంచి ఖచ్చితంగా రెగ్యులర్ ధరలే ఉండాలి. అక్కడి నుంచి ఆక్యుపెన్సీలు మళ్ళీ పెరిగే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది చాలా కీలకం.
ఇక అసలు విషయానికి వస్తే పెద్ది ఆల్రెడీ ఉత్తరాది రాష్ట్రాల్లో నెమ్మదిగా ఉంది. ఫైనల్ గా పాతిక కోట నెట్ చేరుకుంటే చాలనేలా పరిస్థితి మారిపోయింది. దారుణంగా పడిపోలేదు కానీ దాని పొటెన్షియాలిటీకి తగ్గట్టు వసూళ్లు రావడం లేదనేది వాస్తవం. కర్ణాటక కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ తమిళనాడు, కేరళలో సోసోగానే వెళ్తోంది. ఓవర్సీస్ లో పది మిలియన్ల అంచనాలు పెట్టుకుంటే ఇప్పుడు టార్గెట్ సగానికి కుదించేశారు. ఇదంతా ఒక రకంగా డేంజర్ సిగ్నల్.
అయితే ఏపీ తెలంగాణ చాలా ప్రాంతాల్లో పెద్ది స్ట్రాంగ్ గానే ఉంది. కొన్ని చోట్ల టికెట్ రేట్లు తగ్గించారు. మరికొన్ని ఏరియాల్లో కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని ప్రాంతాల్లో సమతూకంగా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఉత్తరాంధ్రలో అదరగొడుతున్న పెద్ది సీడెడ్ లో బాగానే వెళ్తున్నా నైజామ్ లో కొంచెం నెమ్మదించింది. టికెట్ రేట్లు ఫ్యామిలీస్ కి ప్రతిబంధకంగా మారాయనే సూచనలు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ నిర్మాతలు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇది రన్ మీద ప్రభావం చూపిస్తోంది.
కొత్త సీన్లు జోడించి అవసరం లేనివి తీసేసి కొత్త వెర్షన్ జోడించే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ మొన్న వినిపించింది కానీ టీమ్ నుంచి ఎలాంటి సంకేతం లేదు. నిజంగా చేసే పనైతే వీలైనంత త్వరగా కానివ్వాలి. ఇంకోవైపు సక్సెస్ మీట్ కోసం ప్లానింగ్ జరుగుతోందట. చిరంజీవి లేదా బాలయ్య అతిథిగా రెండు ఆప్షన్లు చూస్తున్నారని సమాచారం. ఎన్బికె 111 తీస్తోంది వృద్ధి సినిమాస్, పైగా చరణ్ మీద బాలకృష్ణకు ప్రత్యేకమైన బాండింగ్ ఉండటంతో అది సాధ్యమైనా ఆశ్చర్యం లేదు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…