Political News

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన పార్టీ అధినేత‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా తొలిసారి ఒకే స‌మ‌యంలో ఇద్ద‌రు నేత‌లుకూడా విశాఖ‌లో ప‌ర్య‌టించారు. సోమ‌వారం సాయంత్రం విశాఖ‌లోని స్టీల్‌ప్లాంట్ జ‌రిగిన ఘోర ప్ర‌మాదంలో 8 మంది మృతి చెంద‌డం తో పాటుప‌లువురు గాయ‌ప‌డ్డారు. వీరిని ప‌రామ‌ర్శించేందుకు ఇరువురు నాయ‌కులు విశాఖ‌లో ప‌ర్య‌టించారు.

రెస్ట్ ప‌క్క‌న పెట్టి..

ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌.. మంత్రి నారా లోకేష్‌.. ఈ రోజు ఉద‌య‌మే.. హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న బ‌డ‌లిక‌తో మంగ‌ళ‌వారం రెస్ట్ తీసుకోవాల‌ని, కుటుంబ స‌భ్యుల‌తో గ‌డ‌పాల‌ని అనుకున్నారు. కానీ, విశాఖ‌లో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌తో ఆయ‌న ఉద‌యం 10 గంట‌ల‌కే హైద‌రాబాద్ నుంచి నేరుగా విశాఖ‌కు చేరుకున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కూడా మంగ‌ళ‌గిరి నుంచి నేరుగా విశాఖ‌కు చేరుకుని.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.

ప‌ని విభ‌జ‌న‌..

విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితుల ప‌రామ‌ర్శ‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు వ‌చ్చినా.. ఇద్ద‌రూ ఎలాంటి గంద‌ర‌గోళానికి తావివ్వ‌కుండా.. ప‌నిని పంచుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. మంత్రి లోకేష్‌.. నేరుగా ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. వారితో మాట్లాడి.. ఓదార్చారు. వారితో క‌లిసి కూర్చుని వారి బాధ‌ను పంచుకున్నారు. బాధిత కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం నూరిపోశారు.

ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మంగ‌ళ‌గిరి నుంచి నేరుగా విశాఖ‌కు చేరుకున్నా.. అక్క‌డి నుంచి ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి వైద్య‌శాల‌లో చికిత్స పొందుతున్న వారి వ‌ద్ద‌కు వెళ్లారు. వారిని ప‌రామ‌ర్శించారు. వారికి అందుతున్న వైద్యాన్ని, ప్ర‌స్తుత ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుల‌తో నేరుగా మాట్లాడి వారి నుంచి కొంత స‌మాచారం తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు.

ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. ఇరువురు నేత‌లు.. వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. నిజానికి ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు నాన్ ప్లాన్‌గా వ్య‌వ‌హ‌రించే ప‌రిస్థితి ఉంటుంది. కానీ, ప‌వ‌న్‌, లోకేష్‌లు బాధితుల ప‌రామ‌ర్శ‌లో భాగం అయ్యే విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని విమ‌ర్శ‌ల‌కు తావులేకుండా వ్య‌వ‌హ‌రించారు.

This post was last modified on June 9, 2026 7:42 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

6 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

6 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

6 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

7 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

9 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

10 hours ago