జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ అంటే ఒకింత స్పెషలే కదా. ఈ స్పెషల్ సోమవారం భాగ్యనగరి హైదరాబాద్ లో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి వచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య… తెలంగాణ కేబినెట్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. రాజకీయాలను పక్కనపెట్టేసిన ఈ ఇద్దరు నేతలు…బీసీల సంక్షేమం పట్ల విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.
బీసీ సంఘం తెలంగాణ నేతలతో కలిసి సెక్రటేరియట్ కు వచ్చిన కృష్ణయ్య… నేరుగా పొన్నం కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య బీసీల సంక్షేమ శాఖ వ్యవహారాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, బీసీ పిల్లల పీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, బీసీ రోస్టర్ విధానాన్ని సవరించాలని, విదేశీ విద్య పథకంలో నిధులను పెంచి.. మరింత మంది విద్యార్థులకు చేయూతను అందించాలని ఈ సందర్భంగా మంత్రికి కృష్ణయ్య వినతి పత్రాన్ని అందజేశారు.
కృష్ణయ్యతో పాటుగా పొన్నం కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. బీసీల సంక్షేమం కోసం తన జీవితకాలమంతా పోరాటం చేసిన కృష్ణయ్య… ఆదిలో టీడీపీ తరఫున ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి ఆయన తప్పుకున్నా… ఏపీలోని గత వైసీపీ హయాంలో ఆయనకు ఏపీ కోటా నుంచే రాజ్యసభ సభ్యత్వం దక్కింది. ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే… రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేసిన కృష్ణయ్య బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత తాను రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యత్వాన్ని బీజేపీ ఆయనకే అందించింది.
బీజేపీతో కాంగ్రెస్ ఉప్పూనిప్పులా సాగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో బీజేపీ నేతృత్వంలో అదికార ఎన్డీఏ కూటమి ఉండగా… కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష ఇండియా కూటమి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. నిన్నటికి నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మద్య మాటల యుద్ధం ఓ రేంజిలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ రాజకీయ వేడిని తగ్గించేలా సోమవారం పొన్నంతో కృష్ణయ్య భేటీ జరిగిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…