Political News

శోక సంద్రంలో ‘విజయోత్సవం’ వద్దబ్బా

ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో ధైర్యంగా ఎన్నికలకు వెళ్లి… అధికారం దక్కించుకున్న తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ లెక్కన కూటమి సర్కారు కొలువుదీరి రెండేళ్లు పూర్తి అయిన సమయాన… మూడు పార్టీల కూటమి విజయోత్సవాలు చేసుకోవాలి కదా. తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. అయితే విజయోత్సవాల ప్రారంభానికి ఓ రోజు ముందుగా ఏపీకే తలమానికంగా నిలుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. 8 మంది కార్మికులు చనిపోయారు. వెరసి యావత్తు రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో విజయోత్సవం జరుపుకునేదెలా? నిజమే… రాష్ట్ర ప్రజలంతా శోక సంద్రంలో మునిగిన సమయంలో విజయోత్సవాలు అసలు వద్దే వద్దు. ఇదే మాట టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నోట నుంచి వినిపించింది. అనుకున్నంతనే ఆయన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు మాధవ్ తో ఇదే విషయాన్ని చెప్పారు. శోక సంద్రంలో విజయోత్సవాలు వద్దన్న చంద్రబాబు మాటకు ఆ ఇద్దరు నేతలు కూడా సానుకూలంగా స్పందించారు. ఫలితంగా మంగళవారం తిరుపతిలో జరగాల్సిన కూటమి విజయోత్సవ సభ రద్దైపోయింది.

కూటమి పాలనకు రెండేళ్లు నిండిన విషయాన్ని ఇటీవలే జరిగిన కూటమి సమన్వయ సమావేశంలో చర్చ జరిగింది. ప్రజలు గెలిపించిన కూటమి రెండేళ్ల తన పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తరుణాన్ని రాష్ట్ర ప్రజలంతా గుర్తుంచుకునేలా విజయోత్సవాలు జరుపుకోవాలని ఆ సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విజయోత్సవాలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించాలని కూడా తీర్మానించారు. రాయలసీమలో తిరుపతి కేంద్రంగా తొలి సభ, ఉత్తరాంధ్ర సభను విశాఖలో, కోస్తాంధ్ర సభను అమరావతిలో నిర్వహించాలని నాడు నిర్ణయించారు.

విజయోత్సవం పేరిట జరగాల్సిన ఈ సభల్లో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన కీలక నేతలంతా పాలుపంచుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని విజయోత్సవ సభల ద్వారా ప్రతిఫలించేలా చేయాలన్న ప్లాన్ తో చంద్రబాబు వ్యూహం రచించారు. అయితే విశాఖ స్టిల్ ప్లాంట్ ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ వేడుకలను రద్దు చేయాలని స్వయంగా చంద్రబాబే నిర్ణయించడం గమనార్హం. నిజమే మరి… ఈ ప్రమాదం నేపథ్యంలో యావత్తు రాష్ట్ర ప్రజలు శోకసంద్రంలో మునిగిన వేళ… విజయోత్సవాలు నిర్వహించడం సరికాదు కదా. అందుకే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారు.

This post was last modified on June 9, 2026 10:28 am

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

4 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

4 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

4 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

5 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

7 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

8 hours ago