Political News

భూ మాఫియా కోరలు తీశాం: చంద్ర‌బాబు

వైసీపీ హ‌యాంలో చెల‌రేగిపోయిన భూ మాఫియా కోర‌లు పీకామ‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా ఉన్నారని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని సిద్ధాంతంలో సోమ‌వారం ప‌ర్య‌టించిన సీఎం మీ భూమి-మీ హ‌క్కు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రైతుల‌తో ఆయ‌న ముఖాముఖి మాట్లాడారు. వారికి భూమి హ‌క్కు ప‌త్రాల‌ను అందించారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ బొమ్మ‌తో కూడిన పాస్ పుస్త‌కాలు అందించిన విష‌యం తెలిసిందే.

వీటిని ర‌ద్దు చేసిన ప్ర‌స్తుత ప్ర‌భుత్వం.. జ‌గ‌న్ బొమ్మ‌ల స్థానంలో ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌తో కూడిన పాస్ పుస్త‌కాల‌ను రైతుల‌కు అందించింది. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రైతుల‌కు క్యూఆర్ కోడ్ తో కూడిన పాస్ పుస్త‌కాల‌ను అందిస్తున్నామ‌న్నారు. దీనివ‌ల్ల ట్యాంప‌ర్ చేసేందుకు.. భూములు దోచేసేందుకు అవ‌కాశం ఉండ‌ద‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వంలో భూముల కోసం చెల‌రేగి పోయార‌ని విమ‌ర్శించారు.

త‌మ‌కు భూములు ఇవ్వ‌ని వారిని ఎంచుకుని మ‌రీ.. ఏ22లో(నిషేధిత‌) చేర్చార‌ని చంద్ర‌బాబు తెలిపారు. అయితే.. తాము వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌ద‌రు భూముల‌ను ఏ22 నుంచి తొల‌గించి అర్హులైన వారికి ప‌ట్టాల‌ను అందిస్తున్నామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలో అంద‌రి భూముల‌ను తారుమారు చేశార‌ని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువ‌చ్చి.. రైతుల గుండెల‌ను చెద‌ర‌గొట్టార‌ని.. వ్యాఖ్యానించారు. మీ పాస్ పుస్త‌కాల‌పై సైకో ఫొటోలు వేయించుకున్నారు అని జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప్ర‌స్తుతం ఇస్తున్న ప‌ట్టాల‌పై ప్ర‌భుత్వ రాజ‌ముద్ర మాత్ర‌మే ఉంటుంద‌న్నారు. 6 వేల గ్రామాల్లో స‌ర్వే నిర్వ‌హించి.. రైతుల‌కు మేలు చేస్తున్నామ‌న్నారు. జ‌గ‌న్ హ‌యాంలో చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్ద‌డానికి ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. 2019-24 మ‌ధ్య దుర్మార్గుడు పాలించాడ‌ని.. సైకో పాల‌న‌లో అంద‌రూ బాధితులేన‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జాధ‌నం 800 కోట్ల రూపాయ‌లు విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేసి రాళ్ల‌పై బొమ్మ‌లు వేయించుకున్నాడ‌ని తెలిపారు. 26 ల‌క్ష‌ల మందికి కూట‌మి ప్ర‌భుత్వం మేలు చేసింద‌ని చెప్పారు. ప‌దే ప‌దే ప్ర‌భుత్వాల‌ను మార్చే సంస్కృతిని వ‌దిలి పెట్టాల‌ని సుస్థిర‌మైన ప్ర‌భుత్వం కొన‌సాగితే.. అభివృద్ధి కొన‌సాగుతుంద‌న్నారు.

This post was last modified on June 8, 2026 2:34 pm

Share

Recent Posts

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

9 hours ago

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…

9 hours ago

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…

10 hours ago

ఏడున్న‌ర గంట‌ల‌పాటు నిల‌బ‌డిన లోకేష్‌

ఒక గంట నిల‌బ‌డేందుకే ఇబ్బంది ప‌డ‌తాం. అలాంటిది ఏకంగా ఏడున్న‌ర‌గంట‌ల పాటు ఏక‌బిగిన నిల‌బ‌డ‌డం అంటే మాట‌లా? ఊహించేందుకే క‌ష్ట‌మైన…

10 hours ago

కనకవర్షం కురవాల్సిందే కనకరాజూ

కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…

11 hours ago

అంబటి నోటి దురుసు తగ్గేలా లేదు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…

11 hours ago