Movie News

దృశ్యం 3 ఎండింగ్.. మాస్టర్ ప్లాన్ ఉందా లేక కన్ఫ్యూజనా?

దృశ్యం 3 థియేటర్లలో 200 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకుల బుర్రలో ఒకే ప్రశ్న తిరుగుతోంది. దర్శకుడు జీతూ జోసెఫ్ కథకు సరైన ముగింపు ఇవ్వకుండా సస్పెన్స్ తో ఎందుకు వదిలేశాడు అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్ గా మారింది. ఇది కావాలని ప్లాన్ చేసిన ఎత్తుగడా లేక కథను ఎలా ముగించాలో తెలియక చేసిన పనా అనే డిస్కషన్ మొదలైంది. జార్జ్ కుట్టీ ఫ్యామిలీ డ్రామాను ఇంకెంత కాలం సాగదీస్తారనే పెదవి విరుపులు కూడా నెట్టింట గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఒకే మర్డర్ కేసు చుట్టూ మూడు భాగాలు తీయడం మామూలు విషయం కాదు. ఫస్ట్ పార్ట్ మంచి ట్విస్ట్ తో ఆకట్టుకుంటే, రెండో భాగం ఎమోషన్స్ తో అంతకుమించి కనెక్ట్ అయింది. ఇక మూడో భాగానికి జనాలు థియేటర్లకు వెళ్లారంటే దానికి ప్రధాన కారణం జార్జ్ కుట్టీ క్యారెక్టర్ పై ఉన్న అభిమానమే. కానీ ఒకే కేసు చుట్టూ అవే ఎంక్వయిరీలు మళ్లీ మళ్లీ చూస్తుంటే ఆడియన్స్ కు విసుగు రావడం చాలా సహజం. ఆ క్యారెక్టర్ పై ఉన్న క్రేజ్ క్లిక్కయ్యిందా లేక జనాల్లో ఆసక్తి తగ్గిపోయిందా అనేది ముందు ముందు తేలనుంది.

ఇక్కడే ఓపెన్ ఎండింగ్ లాజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. హాలీవుడ్ లో ఇలాంటి ప్రయోగాలు కొత్త కాదు. ఇన్సెప్షన్ సినిమా క్లైమాక్స్ ను కావాలనే ఒక పజిల్‌లా వదిలేశారు. దానివల్ల ఆ ప్రాజెక్ట్ పై పదేళ్ల తర్వాత కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జీతూ జోసెఫ్ కూడా ఇదే ఫార్ములాను ఇక్కడ వాడినట్లు తెలుస్తోంది. సినిమాకు ఎండ్ కార్డు వేయకపోవడం వల్ల థియేటర్ల బయట కూడా ఆ కథ మీద జోరుగా చర్చలు నడుస్తున్నాయి. తర్వాత ఏమవుతుందనే ఈ క్యూరియాసిటీనే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది.

అయితే దీనికి ఇంకో నెగిటివ్ యాంగిల్ కూడా ఉంది. కథను లాజికల్ గా పూర్తి చేయలేకే దర్శకుడు మధ్యలో వదిలేశాడనే విమర్శలు వస్తున్నాయి. నాలుగో భాగం కోసం తన దగ్గర ప్రస్తుతం ఎలాంటి స్టోరీ లైన్ లేదని జీతూ గతంలోనే చెప్పాడు. అలాంటప్పుడు మూడో భాగంతోనే ఈ సిరీస్ కు ముగింపు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న లాజికల్ గానే అనిపిస్తుంది. ఒక వర్గం ఈ సస్పెన్స్ ను బాగా ఎంజాయ్ చేస్తుంటే, మరో వర్గం మాత్రం కథను గౌరవంగా ముగించేయాలని కోరుకుంటోంది.

సాధారణంగా ఒక సినిమా సిరీస్ ను ఎప్పుడు ఆపాలో మేకర్స్ కు క్లారిటీ ఉండాలి. క్రేజ్ పీక్స్ లో ఉన్నప్పుడు ముగించడం ఎప్పుడూ సేఫ్ గేమ్. జనాలకు మొహం మొత్తేలా సాగదీస్తే అసలుకే మోసం వస్తుంది. అయితే జీతూ సస్పెన్స్ ఇచ్చి బంతిని ప్రేక్షకుల కోర్టులోకి నెట్టేశాడు. పబ్లిక్ లో డిమాండ్ ఉంటే నాలుగో భాగం తీయొచ్చు, లేదంటే సైలెంట్ గా వదిలేయొచ్చు. ఇదొక స్ట్రాటజీ అయితే మాస్టర్ పీస్ అవుతుంది. లేదంటే కన్ఫ్యూజన్ తో తీసుకున్న నిర్ణయమైతే ఇబ్బందే.

This post was last modified on June 8, 2026 1:20 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

2 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

2 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

2 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

3 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

5 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

6 hours ago