జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక విషయం బుర్రలోకి చేరినంతనే… దాని పర్యవసానాల గురించి ఎంతమాత్రం ఆలోచించని ప్రస్తుత యువత…ఆ పనులను ఇట్టే ముగించేస్తున్నారు. ఆపై అడ్డంగా దొరికిపోతున్నారు కూడా. తాజాగా ఆదివారం హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఓ ఘటనను చూస్తే… ఈ వాదనలు అక్షర సత్యమని చెప్పవచ్చు.
బీఆర్ఎస్ కు చెందిన నేత సురేశ్… సనత్ నగర్ లోని జెక్ కాలనీలో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు. సురేశ్ కు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు గానీ, ఇతరత్రా వివరాలు గానీ బయటకు రాలేదు గానీ..ఇటీవలే ఆమె ఓ యువకుడి ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలో ఈ జంట మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో తెలియదు గానీ… తన లవర్ అడిగాడో, ఈమే అతడికి సాయం చేయాలనుకుందో తెలియదు గానీ… తన సొంతింటిలోనే ఆమె దొంగగా మారిపోయింది.
సురేశ్ ఈ మధ్యే తన ఇంటిలో భారీగా నగదును తీసుకొచ్చారట. ఈ విషయం ముందుగా తెలిసిందో, లేదంటే…నగదు ఇంటికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసిందో తెలియదు గానీ… ఆ డబ్బు నుంచి ఆమె ఏకంగా రూ.1.5 కోట్లను చోరీ చేసింది. ఇంత భారీ మొత్తాన్ని ఆమె ఎలా బయటకు తీసుకెళ్లిందో తెలియదు గానీ… దానిని ఆమె తన ప్రియుడికి అందజేసింది. ఆ తర్వాత ఇంటిలో ఉన్న నగదు కనిపించకపోవడంతో సురేశ్ పోలీసులకు సమాచారం అందించారు.
జెక్ కాలనీలో భారీ చోరీపై ఫిర్యాదు అందగా.. కనిపించకుండా పోయిన మొత్తం రూ.1.5 కావడంతో పోలీసులు వేగంగానే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ముందుగా ఇంటి వారినే పోలీసులు ప్రశ్నించారు. అందులో భాగంగా సదరు యువతిని కూడా పోలీసులు ప్రశ్నించారు. పోలీసులను చూడగానే కంగారుపడిపోయిన ఆ యువతి… పోలీసుల ముందు ఇట్టే నోరు విప్పేసింది. తన లవర్ కోసమే తానే ఈ మొత్తాన్ని తీసుకున్నానని ఆమె చెప్పడంతో పోలీసులతో పాటుగా సురేశ్ ఫ్యామిలీ షాక్ కు గురైంది.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2…
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…
అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ…
ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…
డ్రాగన్ విడుదల ఇంకా సంవత్సరం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలం భారంగా గడిచిపోతోంది. ఒకవేళ వార్ 2 బ్లాక్…
అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.…