జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక విషయం బుర్రలోకి చేరినంతనే… దాని పర్యవసానాల గురించి ఎంతమాత్రం ఆలోచించని ప్రస్తుత యువత…ఆ పనులను ఇట్టే ముగించేస్తున్నారు. ఆపై అడ్డంగా దొరికిపోతున్నారు కూడా. తాజాగా ఆదివారం హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఓ ఘటనను చూస్తే… ఈ వాదనలు అక్షర సత్యమని చెప్పవచ్చు.
బీఆర్ఎస్ కు చెందిన నేత సురేశ్… సనత్ నగర్ లోని జెక్ కాలనీలో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు. సురేశ్ కు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు గానీ, ఇతరత్రా వివరాలు గానీ బయటకు రాలేదు గానీ..ఇటీవలే ఆమె ఓ యువకుడి ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలో ఈ జంట మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో తెలియదు గానీ… తన లవర్ అడిగాడో, ఈమే అతడికి సాయం చేయాలనుకుందో తెలియదు గానీ… తన సొంతింటిలోనే ఆమె దొంగగా మారిపోయింది.
సురేశ్ ఈ మధ్యే తన ఇంటిలో భారీగా నగదును తీసుకొచ్చారట. ఈ విషయం ముందుగా తెలిసిందో, లేదంటే…నగదు ఇంటికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసిందో తెలియదు గానీ… ఆ డబ్బు నుంచి ఆమె ఏకంగా రూ.1.5 కోట్లను చోరీ చేసింది. ఇంత భారీ మొత్తాన్ని ఆమె ఎలా బయటకు తీసుకెళ్లిందో తెలియదు గానీ… దానిని ఆమె తన ప్రియుడికి అందజేసింది. ఆ తర్వాత ఇంటిలో ఉన్న నగదు కనిపించకపోవడంతో సురేశ్ పోలీసులకు సమాచారం అందించారు.
జెక్ కాలనీలో భారీ చోరీపై ఫిర్యాదు అందగా.. కనిపించకుండా పోయిన మొత్తం రూ.1.5 కావడంతో పోలీసులు వేగంగానే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ముందుగా ఇంటి వారినే పోలీసులు ప్రశ్నించారు. అందులో భాగంగా సదరు యువతిని కూడా పోలీసులు ప్రశ్నించారు. పోలీసులను చూడగానే కంగారుపడిపోయిన ఆ యువతి… పోలీసుల ముందు ఇట్టే నోరు విప్పేసింది. తన లవర్ కోసమే తానే ఈ మొత్తాన్ని తీసుకున్నానని ఆమె చెప్పడంతో పోలీసులతో పాటుగా సురేశ్ ఫ్యామిలీ షాక్ కు గురైంది.
This post was last modified on June 7, 2026 4:41 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…