టాలీవుడ్ అగ్ర నిర్మాత సి అశ్వినీదత్ ఇవాళ ఎమోషనల్ అయ్యారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ పాతిక సంవత్సరాల క్రితం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టాక మధ్యలో ఆగిపోయిందని, అప్పటి నుంచి సరిగా నిద్ర పట్టలేదని, ఆ కొరతను నాగ్ అశ్విన్ – స్వప్న – ప్రియాంకలు తీర్చారని, అందుకే ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. పేరు చెప్పలేదు ఆ మెగా మూవీ వెనుకో ఫ్లాష్ బ్యాక్ ఉంది.
1996 తర్వాత చిరంజీవి హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినిదత్ ‘భూలోక వీరుడు’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. హీరోయిన్ గా టబుని ఎంచుకున్నారు. ఇళయరాజాతో పాట రికార్డింగ్ కూడా అయ్యింది. కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ జరిగింది. ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. చిరు – సింగీతం కాంబోని తెరమీద చూడాలని తహతహలాడిన మూవీ లవర్స్ తీవ్రంగా నిరాశ చెందారు.
ఆ తర్వాత వేరే కథతో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో చిరంజీవితోనే ఇంకో మూవీ ప్లాన్ చేశారు దత్తు గారు. అది కూడా అచ్చంగా పైన చెప్పినట్టే ఒక షెడ్యూల్ తర్వాత ఆగిపోయింది. కట్ చేస్తే సీన్ లోకి గుణశేఖర్ ఎంటర్ కావడం, చూడాలని ఉంది సబ్జెక్టుతో మెప్పించడం, మెగాస్టార్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వడం జరిగిపోయాయి. అంత జరిగాక మళ్ళీ ఎప్పుడైనా చిరంజీవి – సింగీతం కలయిక జరుగుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ అది కలగానే ఉండిపోయింది.
సో అశ్వినిదత్తుని నిద్ర పట్టనివ్వకుండా చేసిన సినిమా వెనుక ఇంత కథ ఉంది. బాలయ్యతో భైరవద్వీపం, ఆదిత్య 369, శ్రీ కృష్ణార్జున విజయం లాంటి క్లాసిక్స్ తీసిన సింగీతం శ్రీనివాసరావు గారు నాగార్జునతో ఆకాశవీధిలో చేశారు. చిరంజీవి, వెంకటేష్ తో మాత్రం సాధ్యపడలేదు. సింగ్ గీతంని పర్యవేక్షిస్తున్న నాగ్ అశ్విన్ అన్ని తానై ప్రమోషన్లు చూసుకుంటున్నారు. తొంభై నాలుగేళ్ళ వయసులో సింగీతం శ్రీనివాసరావుగారు తెరమీద ఎలాంటి మేజిక్ చేయబోతున్నారో చూడాలి.
జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక…
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం…
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…