Political News

కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారని, ఇకపై కాంట్రాక్టు ఉద్యోగులన్నమాటే వినిపించదని ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ కేబినెట్ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మాన్ సర్కారు తీసుకున్న ఫలితంగా పంజాబ్ లోని 51 ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిన పనిచేస్తున్న 65,048 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు.

ఆయా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్దతిన 5 ఏళ్లకు మించి పనిచేసిన వారంతా ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారని ఈ సందర్భంగా మాన్ సర్కారు తేల్చి చెప్పింది. పంజాబ్ అవుట్ సోర్స్ డ్ బిల్లు 2026 పేరిట కేబినెట్ ఆమోదం పొందిన ఈ చట్టంతో కాంట్రాక్టు ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో పాటుగా ప్రభుత్వ ఉధ్యోగులకు మాదిరిగా అన్ని ప్రభుత్వ సదుపాయాలకు అర్హత పొందుతారు.

రోజువారీ విధుల్లో భాగంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే అగ్నిమాపక శాఖ, పీఎస్ పీఎల్ లైన్ మన్, పట్టణ, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మూడేళ్ల కాంట్రాక్ట్ పూర్తి చేసిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారని ఈ బిల్లు చెబుతోంది.

ఈ కొత్త బిల్లు గురించి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్వయంగా ఈ విషయాలను మీడియాకు వివరించారు. కేబినెట్ భేటీ అనంతరం నేరుగా మీడియా సమావేశానికి వచ్చిన మాన్.. రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేసే కార్మికులు ఉండబోరని ఆయన ప్రకటించారు.

తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు కార్మికులకు లబ్ధి చేకూరనుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇకపై ఆయా విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిన పనికి కుదిరే కార్మికులు నిర్ణీత కాలం పనిచేయగానే… నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారని కూడా ఆయన ప్రకటించారు.

Kumar

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

37 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

7 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago