Political News

కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉంటారని, ఇకపై కాంట్రాక్టు ఉద్యోగులన్నమాటే వినిపించదని ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ కేబినెట్ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మాన్ సర్కారు తీసుకున్న ఫలితంగా పంజాబ్ లోని 51 ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిన పనిచేస్తున్న 65,048 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు.

ఆయా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్దతిన 5 ఏళ్లకు మించి పనిచేసిన వారంతా ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారని ఈ సందర్భంగా మాన్ సర్కారు తేల్చి చెప్పింది. పంజాబ్ అవుట్ సోర్స్ డ్ బిల్లు 2026 పేరిట కేబినెట్ ఆమోదం పొందిన ఈ చట్టంతో కాంట్రాక్టు ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో పాటుగా ప్రభుత్వ ఉధ్యోగులకు మాదిరిగా అన్ని ప్రభుత్వ సదుపాయాలకు అర్హత పొందుతారు.

రోజువారీ విధుల్లో భాగంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే అగ్నిమాపక శాఖ, పీఎస్ పీఎల్ లైన్ మన్, పట్టణ, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మూడేళ్ల కాంట్రాక్ట్ పూర్తి చేసిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారని ఈ బిల్లు చెబుతోంది.

ఈ కొత్త బిల్లు గురించి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్వయంగా ఈ విషయాలను మీడియాకు వివరించారు. కేబినెట్ భేటీ అనంతరం నేరుగా మీడియా సమావేశానికి వచ్చిన మాన్.. రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేసే కార్మికులు ఉండబోరని ఆయన ప్రకటించారు.

తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు కార్మికులకు లబ్ధి చేకూరనుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇకపై ఆయా విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిన పనికి కుదిరే కార్మికులు నిర్ణీత కాలం పనిచేయగానే… నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారని కూడా ఆయన ప్రకటించారు.

Kumar

Recent Posts

పీఏ అక్ర‌మాలు… గట్టిగా వినిపిస్తున్న జగన్ పేరు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు.. రాష్ట్రంలో జ‌రిగిన అనేక అక్ర‌మాల‌పై ప్ర‌స్తుత ప్ర‌భుత్వం విచార‌ణ చేస్తున్న…

13 minutes ago

తెలుగు దుకాణంలో డబ్బింగ్ వ్యాపారం

వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…

52 minutes ago

వైసీపీ మెడకే చుట్టుకున్న వైఎస్ విగ్రహ ధ్వంసం!

ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో సెలవు దినం ఆదివారం రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో…

5 hours ago

ఓవర్సీస్ ప్లానింగ్ ఇలా ఉండాలి

గత కొన్నేళ్లుగా నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఓవర్సీస్ ప్రీమియర్లు. టైంకి డేటా పంపలేకపోవడం, హార్డ్ డిస్క్ రవాణాలో…

5 hours ago

జగన్ గొడ్డలి కంటే ఎక్కువ: సజ్జల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవలి మహానాడులో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…

6 hours ago

మంగాపురం వైపు దృష్టి మళ్లుతోంది

ఘట్టమేనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న జయకృష్ణ మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్…

7 hours ago