వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా చేసుకుంది. ఒక్కటంటే ఒక్కటి స్ట్రెయిట్ సినిమా లేక మూవీ లవర్స్ కు డబ్బింగులే దిక్కయ్యాయి. వీరభద్రుడుకి నెగటివ్ టాక్, రివ్యూస్ వచ్చినా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయనే కారణంతో జనం బాగానే చూశారు. ఫలితంగా సూర్యకు చాలా కాలం తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. అది కూడా ప్రతికూల వాతావరణంలో.
దృశ్యం 3 బాలేదన్నారు. సోషల్ మీడియా మద్దతు కూడా పెద్దగా లేదు. వెంకటేష్ చేయకపోవడంతో ఆయన అభిమానులు మోహన్ లాల్ ని చూడలేమంటూ లైట్ తీసుకున్నారు. కానీ విచిత్రంగా ఫ్యామిలీ ఆడియన్స్ కొంత మేర అండగా నిలబడ్డారు. ముగింపు ఎలా ఉంటుందోననే నమ్మకంతో జీతూ జోసెఫ్ కోసం థియేటర్లకు వచ్చారు. తాజాగా అర్జున్ బ్లాస్ట్ జోన్ సైతం మంచి ఆక్యుపెన్సీలతో ఏ మాత్రం ఊహించని విధంగా ట్రెండింగ్ లోకి రావడం ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక్కడ చెప్పిన మూడు సినిమాలు మన దగ్గర బ్లాక్ బస్టర్లు కాదు. కానీ చాలా సేఫ్ గేమ్ ఆడాయి. కొన్నవాళ్లకు నష్టం రాలేదు. కారణం మన బంగారంలో మెరుగు లేకపోవడమే. గాయపడ్డ సింహం, జెట్లీ, రేజర్, సతీ లీలావతి, గోదారి గట్టుపైన, పురుషః, రమణి కళ్యాణం, అగ్లీ స్టోరీ, త్రికాల, సందిగ్ధం, ఫస్ట్ టైం, హరుడు, దూరదర్శిని, మరీచిక ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టు అవుతుంది కానీ వీటిలో ఒకటి రెండు తప్ప మిగిలినవి కనీసం జనం దృష్టిలో రిలీజైన పేరు కూడా తెచ్చుకోలేదు.
ఇంత బ్యాడ్ సమ్మర్ గత కొన్నేళ్లలో ఎప్పుడూ చూడలేదని డిస్ట్రిబ్యూటర్లు ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు. బంగారం లాంటి అవకాశం చేజేతులా పోయి డబ్బింగులతో నెట్టుకురావడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4 రాబోతున్న పెద్దితోనే మళ్ళీ పునర్ వైభవం రావాలని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టే సరిపడా హైప్ ఉంది కానీ అది భారీ వసూళ్లుగా మారడం టాక్ మీద ఆధారపడి ఉంది. యావరేజ్ పైనా ఉన్నా చాలు కలెక్షన్ల మోత మోగడం ఖాయం.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…
ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో సెలవు దినం ఆదివారం రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో…
గత కొన్నేళ్లుగా నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఓవర్సీస్ ప్రీమియర్లు. టైంకి డేటా పంపలేకపోవడం, హార్డ్ డిస్క్ రవాణాలో…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవలి మహానాడులో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…
ఘట్టమేనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న జయకృష్ణ మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్…