Political News

పాలన… ప్లానింగ్… బాగున్నాయి లోకేష్

పాల‌న విష‌యంలో మంత్రి లోకేష్ ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయాల‌ను విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను క‌ల‌గాపుల‌గం చేయ‌కుండా.. ఎవ‌రి పాత్ర వారు పోషించేలా ఆయ‌న ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హరిస్తున్నారు.

గ‌త రెండేళ్లుగా మంత్రి లోకేష్ తీరును ప‌రిశీలిస్తున్నా.. ఆయ‌న నిర్వ‌హిస్తున్న శాఖ‌ల అధికారుల ప‌నితీరును ప‌రిశీలిస్తున్నా.. ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. రాజ‌కీయ విమ‌ర్శ‌ల విష‌యంలో త‌న పాత్ర‌ను త‌గ్గించుకోకుండా.. ఎప్ప‌టికప్పుడు దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ చేసే విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న స్పందిస్తున్నారు.

ఇక‌, పాల‌నాప‌ర‌మైన అంశాల్లో తాను ఎంత వ‌ర‌కు ఉండాలో అంత వ‌ర‌కు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కీల‌క అంశాల‌పై వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌తాధికారుల‌కే వ‌దిలేస్తున్నారు. త‌ద్వారా టెక్నిక‌ల్ అంశాలు.. విధాన‌ప‌ర‌మైన అంశాల విష‌యంలో క్లారిటీ ఇచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వాస్త‌వానికి ఒక విష‌యంపై వివాదం ఏర్ప‌డితే.. మంత్రిగా ఆయ‌న స‌మాధానం చెప్పేందుకు అవ‌కాశం ఉంది. కానీ, విధాన‌ప‌ర‌మైన అంశాలు కావ‌డంతో సంబంధిత ఉన్న‌తాధికారులు దానిపై స్పందిస్తే.. స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఇదేసూత్రాన్ని మంత్రిగా నారా లోకేష్ ఫాలో అవుతున్నారు.

గ‌తంలోను ఇప్పుడు కూడా.. విద్యాశాఖ‌కు సంబంధించి రెండు అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం ఎంత మందికి అంద‌లేద‌న్న విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చి.. ఓ వ‌ర్గం మీడియాలో పెద్ద ఎత్తున వ్య‌తిరేక వార్త‌లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో రాజ‌కీయం-విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను క‌లిపి చూడ‌కుండా.. ఒక‌వైపు రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు తాను చెక్ పెడుతూనే.. విధాన‌ప‌ర‌మైన సందేహాలు, అనుమానాల‌కు అధికారుల‌తో వివ‌ర‌ణ ఇప్పించారు. దీంతో స‌రైన స‌మాచారం ప్ర‌జ‌ల‌కు చేరింది. ఇది వివాదాల‌కు ముగింపు ప‌లికేలా ప‌నిచేసింది.

తాజాగా డీఎస్సీ వ్య‌వ‌హారంపైనా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అన‌ర్హుల‌కు ఉద్యోగాలు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కూడా చోటు చేసుకున్నాయి. దీనిపై మంత్రిగా తాను వివ‌ర‌ణ ఇస్తే.. దానిని రాజ‌కీయంగా చూసేందుకు.. త‌మ‌కు అనుకూలంగా వాడుకునేందుకు ప్ర‌త్య‌ర్థులు సిద్ధంగా ఉన్న విష‌యాన్ని గుర్తించిన మంత్రి.. విధాన‌ప‌ర‌మైన అంశం కావ‌డంతో పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శితోనే మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు.

దీంతో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న సందేహాల‌కు ముగింపు ప‌లికిన‌ట్టు అయింది. ఇక, నంద్యాలలో వైఎస్ విగ్ర‌హ ధ్వంసం వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు. తానే స్వ‌యంగా జోక్యం చేసుకున్నారు. ఇది రాజ‌కీయం కావ‌డంతో తానే జోక్యం చేసుకుని ముగింపు ప‌లికే ప్ర‌య‌త్నం చేశారు.

This post was last modified on May 31, 2026 10:40 pm

Share

Recent Posts

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

33 minutes ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

4 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

6 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

7 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

9 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

10 hours ago