సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి. సనాతన ధర్మం ఒక మలేరియా లాంటిదని.. దాన్ని నిర్మూలించడమే తన లక్ష్యమని డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే.
ఐతే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఉదయనిధి తీరు మారలేదు. మరోసారి సనాతన ధర్మం గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఐతే తమిళనాట హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నా, హిందుత్వం బలంగా ఉన్నా సరే.. ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించిన నాయకులు తక్కువ.
ముఖ్యంగా సినిమా వాళ్లెవ్వరూ ఆ వ్యాఖ్యలను ఖండించింది లేదు. ఐతే ఇప్పుడు ఉదయనిధి ప్రతిపక్షంలో ఉండగా.. సీనియర్ హీరో అర్జున్ సనాతనం మీద ఉదయనిధి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అర్జున్కు దైవభక్తి ఎక్కువ. హిందూ ధర్మం గురించి ఎప్పుడూ గొప్పగా మాట్లాడుతుంటారు.
తన ప్రాంతంలో భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారాయన. తన కొత్త సినిమా ‘బ్లాస్ట్’ రిలీజ్ నేపథ్యంలో మీడియాను కలిసిన ఆయనకు సనాతన ధర్మం గురించి ఉదయనిధి పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండడం గురించి ప్రశ్న ఎదురైంది.
దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘సనాతన ధర్మం అన్నది మతానికి సంబంధించిన విషయం కాదు. సనాతనం అన్నది జీవన విధానం. అది మనిషి ఎలా బతకాలో చెబుతుంది. నువ్వు నీ కష్టాన్ని నమ్ముకో, నీతిగా బతుకు, వేరే వాళ్ల సొమ్ముకు ఆశపడకు అని సనాతన ధర్మం అంటుంది.
మనల్ని పిల్లలుగా ఉన్నపుడు తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, వాళ్లు ముసలివాళ్లయ్యాక వారిని మనం బాగా చూసుకోవాలని సనాతనం సూచిస్తుంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటే.. తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటికి తోసేయాలి అని చెబుతున్నట్లు. నాకు అర్థమైన మేర నేను చెబుతున్నా’’ అని అర్జున్ పేర్కొన్నాడు. ఇప్పటికైనా సినీ రంగం నుంచి ఒక్కరైనా ఉదయనిధి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారంటూ అర్జున్ మీద తమిళులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…