Political News

1000 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా, భూముల నుంచి మైనింగ్ వ‌ర‌కు కూడా అనేక రూపాల్లో ప్ర‌జ‌ల ధ‌నాన్ని దోచుకున్నార‌న్న కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే మ‌ద్యం, గ‌నులు, ఇసుక‌.. అక్ర‌మాల‌పై పెద్ద ఎత్తున విచార‌ణలు కూడా జ‌రుగుతున్నాయి. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప‌ల్నాడు జిల్లా వినుకొండ‌కు చెందిన బొల్ల బ్ర‌హ్మ‌నాయుడు.. హైద‌రాబాద్‌లో ఏకంగా 1000 కోట్ల రూపాయ‌ల విలువ చేసే భూమిని క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని పోలీసులు తెలిపారు.

ఎక్క‌డ‌.. ఎంత‌..?

హైద‌రాబాద్‌లోని అత్యంత ఖ‌రీదైన ప్రాంతంగా ఉన్న గండిపేట‌లో సుమారు వెయ్యి కోట్ల రూపాయ‌ల విలువైన భూమిని న‌కిలీ ప‌త్రాల‌తో కొట్టేసేందుకు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు స‌హా.. ఆయ‌నకు చెందిన వారే ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో రిజిస్ట్రేష‌న్‌కు కూడా స‌న్నాహాలు చేసుకున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన గండిపేట త‌హ‌సీల్దార్‌.. రిజిస్ట్రేష‌న్‌ను నిలువ‌రించి.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారంపై.. శేరిలింగంప‌ల్లి డీసీపీ శ్రీనివాస్ ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు.

వైసీపీ హ‌యాంలో..

వైసీపీ హ‌యాంలోనే హైద‌రాబాద్లోని గండిపేటలో సర్వే నంబర్‌ 18లో ఉన్న భూమికి నకిలీ జీవోలు సృష్టించారు. ఈ క్ర‌మంలో నిమ్మల రాజేశ్‌ గౌడ్‌, వేణుగోపాల్‌, సాయికిరణ్‌ల పాత్ర ఉంది. వైసీపీ నేత‌ బొల్లా బ్రహ్మనాయుడు, ఆయ‌న సోద‌రుడు బొల్లా రమేశ్‌ల పాత్ర కూడా ఉంది. ప్రభుత్వమే త‌మ‌కు స‌ద‌రు భూమిని ఇచ్చింద‌ని పేర్కొంటూ.. న‌కిలీ జీవోలు సృష్టించారు. వీటి ఆధారంగా రిజిస్ట్రేష‌న్ చేయించేందుకు ప్ర‌య‌త్నించారు. వాస్త‌వానికి చట్టబద్ధ హక్కులు లేకుండానే.. ఆ భూమిని త‌మ‌కు బ‌ద‌లాయించుకుని త‌ర్వాత‌.. అమ్మేసేందుకు భారీ కుట్ర చేశారు. అంతేకాదు.. ఎక‌రం మూడున్న‌ర కోట్ల రూపాయ‌లకు విక్ర‌యించే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

ఈ క్ర‌మంలో విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో గ‌త కొన్నాళ్లుగా విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు.. ఈ అక్రమంలో 4 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చేతులు మారినట్లు గుర్తించారు. స్వ‌యంగా వైసీపీనేత‌ బొల్లా ఖాతా నుంచే 2 సార్లు న‌గ‌దు బ‌దిలీ అయిన‌ట్టు తెలుసుకున్నారు. నార్సింగి పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేయ‌గా.. ఈ విష‌యం తెలిసిన బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు, ఆయ‌న సోద‌రుడు.. కూడా ప‌రార‌య్యార‌ని డీసీపీ తెలిపారు. అయితే.. వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.

Kumar

Recent Posts

సాయికృష్ణ కేసులో ప్రభుత్వ కీలక నిర్ణయం

సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక…

20 minutes ago

మూడో పుట్టినరోజుకైనా శుభవార్త చెబుతారా

2024 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వంభర టీజర్ మీద నెగటివ్ రియాక్షన్లు చాలా వచ్చాయి. ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు…

1 hour ago

కొత్త శుక్రవారం… కావాలి శుభప్రదం

టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…

4 hours ago

ఎక్కడ చూసినా GV ప్రకాష్ సంగీతమే

టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…

4 hours ago

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

6 hours ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

7 hours ago