Political News

తెలంగాణ ఏర్పడ్డాక.. తొలిసారి.. ఎన్టీఆర్ విగ్రహం

ప్రాంతాలు వేరైనా.. మన అంతరంగం ఒకటేనన్నా.. అంటూ ప్రాంతాల విభేదాలను పక్కన పెట్టి తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకున్న నాయకుడు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన నేత అన్నగారు ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ నడిబొడ్డున మైత్రీవనంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిష్కరించారు.

అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలకు అన్నగారి విగ్రహం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారులు రామకృష్ణ, మోహన్‌కృష్ణతో పాటు ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు.

ఆదిలో ఏపీ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకులు కూడా తాజాగా మౌనంగా ఉండిపోయారు. పైగా ఎన్టీఆర్ సెంటిమెంట్‌ను బీఆర్ఎస్ కూడా నమ్ముకున్న నేపథ్యంలో ప్రస్తుత విగ్రహ ఆవిష్కరణ విషయంలో మౌనంగా ఉండిపోయింది.

కాగా గత ఏడాది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో విజయం దక్కించుకున్న తర్వాత ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన జయంతిని పురస్కరించుకుని అమీర్‌పేట్ మైత్రీవనం సర్కిల్‌లో ఏర్పాటు చేశారు. ఒకరకంగా తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ఇదే తొలిసారి.

Satya

Recent Posts

పెళ్లికొడుకుల ఎంపిక‌లో కొత్త పోక‌డ‌లు.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌మే!

పెళ్ళికొడుకుల ఎంపికలో కాలానికి అనుగుణంగా పరిస్థితులు మారిపోతున్నాయా? లేకపోతే పరిస్థితులకు అనుగుణంగా కాలమే మారిపోతుందో.. అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.…

3 minutes ago

రోమాంచకంకు సందీప్ వంగా స్టాంపు

తెలుగులోనే కాదు అటు హిందీలోనూ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్టులో ఉన్న పేరు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ముఖ్యంగా…

30 minutes ago

ప‌సుపు సేన‌-జ‌న‌సేన‌.. ఇక‌, తిరుగులేదుగా!

ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న రెండు పార్టీల మధ్య సమన్వయం సాధించే దిశగా పై స్థాయిలో మార్పులు…

1 hour ago

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. పవన్ స్ట్రాటజీ అదుర్స్

గోదావరి పుష్కరాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న వ్యూహం ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న…

1 hour ago

తెలుగు IMAX కల నెరవేరుతోంది

ఒకప్పుడు హైదరాబాద్ మూవీ లవర్స్ కు హాట్ స్పాట్ గా ప్రసాద్ ఐమాక్స్ ఉండేది. అతి పెద్ద స్క్రీన్ తో…

1 hour ago

పాటలు వాడినందుకు 400 కోట్లు కట్టాలా?

ప్రస్తుతం బాలీవుడ్ దృష్టంతా నెక్స్ట్ బిగ్ రిలీజ్ ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ మీదే ఉంది. వరుణ్ ధావన్…

1 hour ago