వచ్చే వారం విడుదల కాబోతున్న పెద్దికి మదరాస్ హైకోర్టు యాంటీ పైరసీ ఇంజక్షన్ రక్షణ కల్పించింది. అంటే ఎవరైనా ఈ సినిమాని పైరసీ చేసి వెబ్ సైట్స్ లో పెట్టినా, ఎక్కడైనా యాప్స్ లేదా ఆన్ లైన్ ద్వారా రవాణా చేసినా వెంటనే కట్టడి చేసే స్వతంత్రం నిర్మాణ సంస్థకు ఉంటుంది. అంటే ఉదాహరణకు ఫలానా ఏబిసి సైట్ లో ఎవరో పెద్ది అప్లోడ్ చేశారనుకుందాం. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఎలాంటి అనుమతులు అవసరం లేకుండా ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వాటిని తక్షణం తీసేయాలి.
ఇది నిజంగా ఫలితం ఇస్తే ప్రపంచాన్ని జయించినట్టే. ఎందుకంటే ఎన్ని చర్యలు తీసుకున్నా దశాబ్దాలుగా ఇండస్ట్రీని పైరసీ భూతం వదల్లేదు. ఆ మధ్య తమిళనాడు సీఎం విజయ్ జన నాయగన్ హఠాత్తుగా హెచ్డిలో లీకై కోలీవుడ్ ని కుదిపేసింది. నిర్మాణ సంస్థ సకాలంలో స్పందించి అన్నీ తీయించేసినా అప్పటికే లక్షల్లో జనాలు చూసేశారు. అంతకు ముందు తండేల్, హిట్ 3, గేమ్ ఛేంజర్ లాంటి ఎన్నో కొత్త సినిమాలు ఈ రాకాసి బారిన కోట్ల రూపాయల నష్టం చవి చూశాయి.
ఇప్పుడు పెద్ది వంతు వచ్చింది. నిర్మాత ఈ సవాల్ ని ఎలా ఎదురుకుంటారో చూడాలి. ఒకవేళ సక్సెస్ అయితే ఇతర ప్రొడ్యూసర్లకు కూడా దారి దొరికినట్టు అవుతుంది. ఎందుకంటే జూన్ నుంచి వరసగా మంచి కంటెంట్ ఉన్న పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. లెనిన్, ప్యారడైజ్, విశ్వనాథ్ అండ్ సన్స్, జైలర్ 2, విశ్వంభర, స్వయంభు,భోగి లాంటివి భారీ అంచనాలతో థియేటర్లకు వస్తున్నాయి. వీటికి కూడా ఇంజక్షన్ ఆర్డర్స్ లాంటివి చాలా అవసరమవుతాయి.
రవి అరెస్ట్ కాగానే ఐబొమ్మ అంతరించిపోయిదనుకున్న టైంలో ఇటీవలే మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం పోలీసులను సైతం షాక్ కు గురి చేసింది. బెయిలు మీద బయటికి వచ్చిన రవి తనకు సంబంధం లేదని చెబుతున్నా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. పెద్ది మీద వందల కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది. రికవరీ జరగాలంటే అద్భుతమైన టాక్ తో పాటు పైరసీ ని అణిచివేయాలి. ఇందులో ఎంతవరకు సఫలీకృతమవుతారో ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…