జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కార్యకర్తలకు ఉన్న దూకుడు.. పనిచేద్దామన్న భావన.. నాయకులకు లేకుండా పోయిందన్నారు. పదవులు వచ్చిన తర్వాత నాయకులు చప్పబడి పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజమండ్రిలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీలో పనిచేయగలిగిన వారే ఉండాలని.. లేకపోతే.. పార్టీ నుంచి వెళ్లి పోవచ్చని తెగేసి చెప్పారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.
పదువులు రాగానే మెత్తబడిపోయిన నాయకులు పార్టీకి అవసరం లేదని పవన్ చెప్పారు. టీడీపీ కోసం తాను పనిచేయడం లేదని.. రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తున్నానని చెప్పారు. అందుకే సర్దుకు పోతున్నానని వ్యాఖ్యానించారు. అన్నింటికీ తెగించే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతామని.. బలహీనంగా ఉన్నప్పుడు కాదని వ్యాఖ్యానించారు.. కులాలను రెచ్చగొట్టే మనస్తత్వం మంచిది కాదని సూచించారు. పార్టీలో ఉండగలిగే వారే ఉండాలని లేకపోతే వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు.
వ్యక్తిగతంగా విమర్శిస్తే.. అంతే స్థాయిలో బదులిస్తామని పవన్ తేల్చి చెప్పారు. `భరిస్తాం.. సహిస్తాం.. అవసరమైతే తాటతీస్తాం“ అని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్నవారంతా సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. దీనికిగాను ఒక సిద్ధాంత ప్రాతిపదికను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నట్టు వివరించారు. జనసేన కార్యకర్తలు, నాయకులు మరింత బలపడాల్సి ఉందని చెప్పారు. కానీ.. కార్యకర్తల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. నాయకులు మాత్రం చప్పబడి పోయారని విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…