టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్… ఏపీలో విద్యా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో సర్కారీ విద్యా వ్యవస్థ అద్భుతాలను సాధిస్తోంది. ఇందుకు దారి తీసిన పరిణామాలను పరిశీలిస్తే… ఏపీలో అప్పటిదాకా పాఠశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేది.
లోకేశ్ మంత్రిగా వచ్చాక… ఈ పథకాన్ని జూనియర్ కాలేజీల దాకా విస్తరించారు. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. తాజాగా లోకేశ్ చూపిన ఈ బాటలోకి తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చేసింది. తెలంగాణవ్యాప్తంగా జూనియర్ కాలేజీల్లో ఉదయం అల్పాహారంతో పాటు పాటు అందించాలని శనివారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాగంగా విద్యా శాఖకు సంబంధించి పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
ఆయా శాఖలను మంత్రులకు కేటాయించిన రేవంత్… విద్యా శాఖను మాత్రం ఎవరికీ కేటాయించకుండా తన వద్దే ఉంచుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కారీ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి అత్యుత్తమ ఫలితాలను రాబట్టాలన్న కసితో రేవంత్ సాగుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ విద్యా శాఖలో పలు కొత్త నిర్ణయాలు తీసుకున్న రేవంత్ సర్కారు… తాజాగా జూనియర్ కళాశాలల్లో భోజన పథకాన్ని విస్తరింపజేయాలని తీర్మానించింది. ఈ మేరకు కళాశాలలకు వచ్చే విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటుగా పాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పల్లె సీమల నుంచి మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న జూనియర్ కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు ప్రయోజనం లభించనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి…
ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు…
రావు బహదూర్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధి, నిర్మాత మధ్య జరిగిన సంభాషణలో ఒక సినిమా 450 కోట్లు…
లీకైన విడుదల తేదీ అఫీషియల్ అయిపోయింది. జైలర్ 2 రిలీజ్ డేట్ అక్టోబర్ 15 ఖరారు చేస్తూ చిన్న వీడియో…
జూలై 10 విడుదల కాబోతున్న లెనిన్ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఈసారి గ్యారెంటీ హిట్టు కొడతాడనే నమ్మకం అఖిల్ లో పుష్కలంగా…
కోలీవుడ్ లోనే కాదు మన టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ లోనూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు హాట్ టాపిక్ గా మారాయి.…