టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్… ఏపీలో విద్యా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో సర్కారీ విద్యా వ్యవస్థ అద్భుతాలను సాధిస్తోంది. ఇందుకు దారి తీసిన పరిణామాలను పరిశీలిస్తే… ఏపీలో అప్పటిదాకా పాఠశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేది.
లోకేశ్ మంత్రిగా వచ్చాక… ఈ పథకాన్ని జూనియర్ కాలేజీల దాకా విస్తరించారు. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. తాజాగా లోకేశ్ చూపిన ఈ బాటలోకి తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చేసింది. తెలంగాణవ్యాప్తంగా జూనియర్ కాలేజీల్లో ఉదయం అల్పాహారంతో పాటు పాటు అందించాలని శనివారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాగంగా విద్యా శాఖకు సంబంధించి పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
ఆయా శాఖలను మంత్రులకు కేటాయించిన రేవంత్… విద్యా శాఖను మాత్రం ఎవరికీ కేటాయించకుండా తన వద్దే ఉంచుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కారీ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి అత్యుత్తమ ఫలితాలను రాబట్టాలన్న కసితో రేవంత్ సాగుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ విద్యా శాఖలో పలు కొత్త నిర్ణయాలు తీసుకున్న రేవంత్ సర్కారు… తాజాగా జూనియర్ కళాశాలల్లో భోజన పథకాన్ని విస్తరింపజేయాలని తీర్మానించింది. ఈ మేరకు కళాశాలలకు వచ్చే విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటుగా పాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పల్లె సీమల నుంచి మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న జూనియర్ కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు ప్రయోజనం లభించనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on May 23, 2026 5:53 pm
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…