Political News

ప్రొఫెసర్ తప్పు ఒప్పుకున్నారుగా!

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను తప్పు చేసినట్టుగా ఒప్పేసుకున్నారు. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ పార్టీ పీఏసీ చైర్మన్, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లు కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసినట్లుగా ఇటీవలే నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా జగన్ ను అరెస్టు చేయాలని పవన్ కోరితే… అందుకు నో చెప్పిన అమిత్ షా… చంద్రబాబు తమకు పార్ట్ టైం మిత్రుడని, జగన్ లాంగ్ టైం మిత్రుడని షా చెప్పినట్లుగా నాగేశ్వర్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకే తెర తీశాయి. అయితే గురువారం తాను చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటున్నట్లు నాగేశ్వర్ స్వయంగా ప్రకటించారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చలో పాలుపంచుకున్న సందర్భంగా ఈ అంశంపై నాగేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. పవన్, నాదెండ్లపై తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి బేషజాలు గానీ, ఎలాంటి శషబిషలు లేకుండా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంలో తనకు ఓ వ్యక్తి ద్వారా సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని పరిశీలించకుండానే తాను వాటిని అలాగే చెప్పానని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని, తాను తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే… ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించిన వైనంపై జనసేన కూడా వేగంగానే స్పందించింది. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దామని, ఇకపై జనసేన కార్యకర్తలు గానీ, నేతలు గానీ ఈ విషయాన్ని ప్రస్తావించరాదని ఆ పార్టీ కోరింది.

అంతేకాకుండా నాగేశ్వర్ ను సీనియర్ మోస్ట్ అనలిస్ట్ గా పేర్కొన్న జనసేన… ఇకపై ఈ తరహా సమాచారం వస్తే.. దానిపై మాట్లాడే ముందు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని, తామే పూర్తి వివరాలను వెల్లడిస్తామని కూడా వెల్లడించింది. వెరసి నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, దానిని జనసేన స్వాగతించడంతో ఈ వ్యవహారం ఇక ముగిసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on May 21, 2026 10:02 pm

Share

Recent Posts

‘సనాతన’ వివాదంపై అనసూయ క్లారిటీ

టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…

60 minutes ago

ప‌వ‌న్ స‌తీమ‌ణి సింప్లిసిటీ… రైలులో పిఠాపురం వరకు..

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సతీమ‌ని అన్నా కొణిదెల ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నారు. త‌న…

1 hour ago

రాజగోపాల్ రెడ్డిపై ఈసారి వేటు తప్పదా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…

1 hour ago

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

3 hours ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

3 hours ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

4 hours ago