ఏపీలో భానుడు భగభగ మండుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తింటూ గ్రామీణ జీవన శైలిని గుర్తుచేసుకున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు సమీపంలో కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని గమనించిన సీఎం దంపతులు అక్కడే ఆగారు.
ఈ సందర్భంగా తాజాగా తీసిన తాటి ముంజలను రుచి చూసిన సీఎం చంద్రబాబు.. “కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. పురుగుమందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది” అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు.
మరోవైపు నారా భువనేశ్వరి కూడా ఈ అనుభూతిని పంచుకున్నారు. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయని పేర్కొంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో లభించే సహజ ఆహార పదార్థాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు వారి వృత్తి సమస్యలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ వృత్తులు, సంప్రదాయ ఆహారాలకు ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడ్డారు.
This post was last modified on May 20, 2026 4:38 pm
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…
ఏపీ మంత్రి నారా లోకేష్పై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏకబిగిన ఏడున్నర గంటల పాటు నిలబడి.. ప్రజలకు…