ఏపీలో భానుడు భగభగ మండుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తింటూ గ్రామీణ జీవన శైలిని గుర్తుచేసుకున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు సమీపంలో కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని గమనించిన సీఎం దంపతులు అక్కడే ఆగారు.
ఈ సందర్భంగా తాజాగా తీసిన తాటి ముంజలను రుచి చూసిన సీఎం చంద్రబాబు.. “కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. పురుగుమందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది” అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు.
మరోవైపు నారా భువనేశ్వరి కూడా ఈ అనుభూతిని పంచుకున్నారు. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయని పేర్కొంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో లభించే సహజ ఆహార పదార్థాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు వారి వృత్తి సమస్యలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ వృత్తులు, సంప్రదాయ ఆహారాలకు ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడ్డారు.
రావు బహదూర్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధి, నిర్మాత మధ్య జరిగిన సంభాషణలో ఒక సినిమా 450 కోట్లు…
లీకైన విడుదల తేదీ అఫీషియల్ అయిపోయింది. జైలర్ 2 రిలీజ్ డేట్ అక్టోబర్ 15 ఖరారు చేస్తూ చిన్న వీడియో…
జూలై 10 విడుదల కాబోతున్న లెనిన్ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఈసారి గ్యారెంటీ హిట్టు కొడతాడనే నమ్మకం అఖిల్ లో పుష్కలంగా…
కోలీవుడ్ లోనే కాదు మన టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ లోనూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు హాట్ టాపిక్ గా మారాయి.…
తొలి చిత్రం ‘అఖిల్’తోనే సూపర్ స్టార్ అయిపోతాడని అఖిల్ అక్కినేని మీద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు…