బీజేపీ సీనియర్ నేత, ఏపీ కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న సత్యకుమార్ కు ఇప్పుడు సొంత పార్టీకి చెందిన నేతల నుంచే సవాల్ లు వినిపిస్తున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. సత్యకుమార్ కు దమ్ముంటే రాజీనామా చేయాలని, పార్టీ తరఫున పోటీ చేస్తావో, లేదంటే సొంతంగానే పోటీ చేస్తావో చేయమని… ఎలా పోటీ చేసినా ఓడించి తీరతానని బీజేపీకి చెందిన ధర్మవరం స్థానిక నేత సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు.
సొంత పార్టీ అని కూడా చూడకుండా తమపైనే దాడులకు దిగుతారా? అంటూ ఆయన సత్యకుమార్ పై ఒంటికాలిపై లేచారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన మంత్రికి వ్యతిరేకంగా మూకుమ్మడి నిరసనకు దిగారు.
ఇలా తన సొంత పార్టీకి చెందిన ఓ స్థానిక నేత ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి సత్యకుమార్ పై ఈ తరహాలో బహిరంగంగా సవాల్ విసరడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ తరహా పరిణామాలకు దారి తీసిన విషయంలోకి వెళితే… ధర్మవరానికి చెందిన అంజన్ రెడ్డి అనే హైకోర్టు న్యాయవాదిపై సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారట.
ఈ విషయం తెలుసుకున్న సుదర్శన్ రెడ్డి… బీజేపీ శ్రేణులతో పాటు టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మరీ ధర్మవరంలో నిరసనకు దిగారు. కూటమి మంత్రిపై ఇలా వైసీపి మినహా అన్ని పార్టీలకు చెందిన నేతలు మూకుమ్మడి నిరసనకు దిగిన వైనం కలకలం రేపుతోంది.
ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్…అసలు స్థానికుడే కాదని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. అయినా పార్టీ ప్రతిపాదించిన మేరకు స్థానికేతరుడైనా సత్యకుమార్ ను గెలిపించామన్న సుదర్శన్ రెడ్డి… గెలిచాక మంత్రి గారీ అరాచకాలను సహించడం కష్టంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో సత్యకుమార్ అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, సత్యకుమార్ నియోజకవర్గ వ్యాప్తంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు అక్షర సత్యమని కూడా ఆయన పేర్కొన్నారు. తన ఆరోపణలు సత్యదూరమని సత్యకుమార్ భావిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు. మరి సుదర్శన్ రెడ్డి సవాల్ కు సత్యకుమార్ ఎలాంటి బదులిస్తారన్న విషయంపై ఆసక్తికర చర్చకు తెర లేసింది.
This post was last modified on May 20, 2026 4:42 pm
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…