దేశంలో గత ఆరు మాసాలుగా ఒకింత అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం(ఇన్ఫ్లేషన్) ప్రస్తుతం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ కూడా ఇదే మాట చెబుతోంది. దీంతో త్వరలోనే అన్ని రకాల వస్తువుల ధరలతోపాటు.. గృహరుణాలపై వడ్డీలు, పర్సనల్ లోన్లపైనా.. వాహన రుణాలపైనా వడ్డీలు మరింత పెరగనున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి.
ఏంటీ ద్రవ్యోల్బణం?
ద్రవ్యోల్బణం…. ఒక నిర్దిష్ట కాలంలో వస్తువులు, సేవల ధరలు నిరంతరంగా పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడమే ద్రవ్యోల్బణం. దీనివల్ల మార్కెట్లో నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు, జీవన వ్యయం భారమవుతాయి. ప్రస్తుత దేశ ద్రవ్యోల్బణ పరిస్థితులు, దీని ప్రభావాలు ప్రజలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారంగా ద్రవ్యోల్బణం 3.5% వరకు నమోదవుతోంది,
అందులోనూ ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం దాదాపు 4.2% కంటే ఎక్కువగా ఉంది. కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ధరలు మరింత పెరగనున్నాయి. ఇక, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా రూపాయి మారకం విలువ బలహీనపడింది. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని చేరుకున్నాయి. ఫలితంగా రవాణా, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.
ఇక, కీలకమైన ప్రపంచ పరిణామాలు, యుద్ధ నేపథ్యంతో అంతర్జాతీయ సరుకుల రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. ఇది ధరల పెరుగుదలకు దారితీసింది. సాధారణ జీవితంపై ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ప్రజల కొనుగోలు శక్తి పతనమయ్యే అవకాశం ఉంటుంది. సామాన్యుల నెలవారీ బడ్జెట్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. పొదుపు, మదుపులపైనా ప్రభావం చూపుతుంది.
బ్యాంకులలో డబ్బు దాచుకుంటే వచ్చే వడ్డీ కంటే ద్రవ్యోల్బణం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో బ్యాంకులు వడ్డీలను పెంచుతాయి. దీంతో గృహ రుణాలు, వాహన రుణాలు, విదేశీ విద్యా రుణాలపై వడ్డీలను మరింత పెంచే అవకాశం ఉంది.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ రెపో రేట్లను పెంచుతుంది. దీనివల్ల రుణాలపై వడ్డీ పెరిగి.. మార్కెట్లో డబ్బు చలామణి తగ్గుతుంది. సో మొత్తంగా యుద్ధం తెచ్చిన తంటాల కారణంగా.. సామాన్యుల జేబులకు చిల్లులు పడడం ఖాయమని అంటున్నారు నిపుణులు.
This post was last modified on May 20, 2026 9:07 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…