రాజ్ కుమార్ హిరాని.. రాశి కంటే వాసి ముఖ్యం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ బాలీవుడ్ దర్శకుడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు, డంకి.. దర్శకుడిగా ఇవీ ఆయన రూపొందించిన చిత్రాలు. ఇందులో అన్నీ విజయవంతమైన చిత్రాలే. ‘డంకి’ జస్ట్ హిట్ అయింది. మిగతావన్నీ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. హిరాని అనే పేరు పోస్టర్ మీద కనిపిస్తే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయే ప్రేక్షకులు దేశంలో లక్షల మంది ఉన్నారు.
ఐతే ‘డంకి’ తర్వాత ఆయన కొత్త సినిమా విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. మున్నాభాయ్-3 అని, 3 ఇడియట్స్ సీక్వెల్ అని రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా ఏ సినిమా అధికారికంగా ప్రకటించలేదు. ఈ లోపు హిరాని షో రన్నర్గా ఒక వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం. దాని పేరు.. ప్రీతమ్ అండ్ పెడ్రో.
జియో హాట్ స్టార్ వేదికగా ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ స్ట్రీమ్ కాబోతోంది. జులై 3 నుంచి ఈ సిరీస్ ప్రసారం అవుతుంది. ఈ సిరీస్కు హిరాని క్రియేటర్ మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. అవినాశ్ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఇందులో హిరాని తనయుడు వీర్ హిరాని లీడ్ రోల్ చేయడం విశేషం. అతడితో పాటు ‘మున్నాభాయ్’ ఫేమ్ అర్షద్ వార్సీ మరో ముఖ్య పాత్ర చేస్తున్నాడు.
కొడుకును హిరాని సినిమాలతో కాకుండా ఇలా వెబ్ సిరీస్తో ప్రమోట్ చేయడం విశేషమే. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ను బట్టి చూస్తే ఇది ఒక ఏటీఎం దొంగతనం చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. ఇది స్ట్రీమింగ్ అయ్యాక హిరాని నుంచి తర్వాతి సినిమాకు సంబంధించి అప్డేట్ వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత సంకేతాలను బట్టి చూస్తే ఆమిర్ ఖాన్తో ఆయన ‘3 ఇడియట్స్’ సీక్వెల్నే పట్టాలెక్కించే అవకాశముంది.
This post was last modified on May 20, 2026 11:58 am
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…