ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో వెంకటేష్ దీన్ని రీమేక్ చేయడం లేదనే క్లారిటీ ఫుల్ గా వచ్చేసింది. ఆదర్శ కుటుంబం, అనిల్ రావిపూడి సినిమాలతో బిజీగా ఉండటంతో ఇంకో ఆరేడు నెలల దాకా వెంకీ మామ అందుబాటులోకి రావడం కష్టమే. అందుకే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు భాగాల్లో రాంబాబుని చూసిన కళ్ళతో జార్జ్ కుట్టిని ఎలా జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో.
హైదరాబాద్ లో ఉదయం ఎనిమిది గంటలకు ఫ్యాన్స్ షో వేయడం గమనార్హం. మలయాళంలో ట్రెండింగ్ అయితే బాగానే ఉంది కానీ ఏపీ తెలంగాణలో ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. దృశ్యంకున్న బ్రాండ్ వేల్యూనే జనాన్ని థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకంతో నిర్మాతలున్నారు. చాలా సంవత్సరాలుగా మోహన్ లాల్ డబ్బింగ్ మూవీ తెలుగులో ఆడిన దాఖలాలు లేవు. ఒక్క మన్యం పులి మాత్రమే కమర్షియల్ గా ప్రొడ్యూసర్ కు వర్కౌట్ అయ్యింది.
దృశ్యం 3తో ఈ సిరీస్ కి ముగింపు పలకబోతున్నారు. అంత బాగానే ఉంది గతంలో బరోజ్, ఎంపురాన్ లాంటి వాటికి హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోషన్లు చేసిన మోహన్ లాల్ ఈసారి మాత్రం దూరంగా ఉన్నారు. టైం లేదనో లేక హీరో మారడం గురించి మీడియా నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయనే సంశయమో ఏమో కానీ మొత్తానికి పబ్లిసిటీ లైట్ తీసుకోవడం విచిత్రం. కొంచెం ప్రచారం హడావిడి చేసి ఉంటే ఓపెనింగ్స్ కి హెల్ప్ అయ్యేది.
ప్రస్తుతం వీరభద్రుడు తప్ప బాక్సాఫీస్ వద్ద వేరే ఆప్షన్ లేదు. గోదారి గట్టుపైన అక్కడక్కడా నెట్టుకొస్తోంది కానీ మరీ చెప్పుకునేంత అయితే కాదు. పెద్ది వరకు గ్యాప్ ఉండటంతో ఇమేజ్ ఉన్న హీరోలెవరూ రెండు వారాలు ముందు వెనుకా దానికి పోటీకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ దృశ్యం 3కి మన దగ్గర పాజిటివ్ టాక్ వస్తే ఒక వారం దాకా డీసెంట్ నెంబర్లు చూడచ్చు. మెయిన్ టార్గెట్ కేరళం కాబట్టి మన దగ్గర ఎంత వచ్చినా నిర్మాతలకు అది బోనస్ కిందకే వస్తుంది.
This post was last modified on May 19, 2026 11:14 pm
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర…
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…