వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన బాట పట్టారు. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్న డిమాండ్ తో సోమవారం ఏపీవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.
గుంటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాలుపంచుకున్న అంబటి…టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేశ్ పై విరుచుకుపడిపోయారు. ఈ సందర్భంగా ఆయన లోకేశ్ కు ఓ కొత్త పేరు కూడా పెట్టారు. లోకేశ్ కు లవ్ క్యాష్ అనే పేరు అయితే సూటవుతుందని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు.
తాము అధికారంలోకి వస్తే… అన్నింటి ధరలను తగ్గిస్తామని లోకేశ్ ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారని అంబటి గుర్తు చేశారు. లోకేశ్ మాట నమ్మి జనం టీడీపీకి ఓటేస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత తానిచ్చిన హామీని విస్మరించిన లోకేశ్… ధరలను పెంచుకుంటూ పోతున్నారని ఆయన ఆరోపించారు.
లోకేశ్ కు కమీషన్ల మీద అలవిమాలిన ప్రేమ ఉందన్న అంబటి…తనకు కమీషన్లు వచ్చే రంగాల రేట్లను పెంచని లోకేశ్… పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కమీషన్లు ఇవ్వవు కాబట్టే పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచారంటూ తనదైన శైలి ఆరోపణలు గుప్పించారు.
అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి చమురు, గ్యాస్ దిగుమతులకు ఒకింత ఇబ్బంది కలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిస్థితులను తట్టుకునేందుకు ఇంధన పొదుపు చర్యలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిస్తే… వాటిని టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు కూడా అందిపుచ్చుకుంది.
ఇక దినదినానికి పెరుగుతున్న ఇంధన కొరతను తట్టుకునే క్రమంలోనే ఇటీవలే లీటరుకు రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచింది. ఈ పెంపుదల ఒక్క ఏపీలోనే జరిగిందన్న భావనతో వైసీపీ ఆంధోళనలకు తెర తీసిందంటూ టీడీపీ నుంచి కూడా సెటైర్లు పడిపోతున్నాయి.
This post was last modified on May 18, 2026 12:36 pm
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఇప్పటివరకు ఫ్యాక్షన్, పంచ్ డైలాగ్స్ గుర్తుకొస్తాయి. కానీ కొరటాల శివ ఇప్పుడు ఆ ఇమేజ్ని…
ఇటీవలే విడుదలైన వీరభద్రుడు / కరుప్పు ఊహించని వీకెండ్ నమోదు చేసింది. ట్రేడ్ టాక్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నూటా పాతిక…
కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో కేరళ…
ఇవాళ పెద్ది ట్రైలర్ రానుంది. మధ్యాన్నం ముంబైలో మూడు గంటలకు జరిగే ఈవెంట్ లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు.…
తమిళనాడులో విజయ్ సిఎం అయ్యారు. రజనీకాంత్ నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. కమల్ హాసన్ వేగం తగ్గిపోయింది. అజిత్ కారు రేసులంటూ…
రాజకీయాల్లో చింత చచ్చినా పులుపు చావదని అన్నట్టుగా కొందరు నాయకులు వ్యవహరిస్తారు. ఇలాంటి వారిలో ఏపీ మాజీ సీఎం జగన్…