Political News

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అదికారంలో ఉండగా… ఫార్ములా ఈ రేసు కార్ల పేరిట భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తాజాగా ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు… జూలై 31న హాజరు కావాలంటూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు కేటీఆర్ కోర్టు విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్ కు విశ్వవ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కేలా చేస్తామంటూ చెప్పిన బీఆర్ఎస్ సర్కారు.. అందులో భాగంగా నగరంలో ఫార్ములా ఈ కారు రేసులను నిర్వహించింది. ఇందుకోసం కారు రేసుల సంస్థకు రూ.55 కోట్లను చెల్లించింది. ఈ మొత్తాన్ని విదేశాల్లోని సదరు సంస్థకు చెల్లించేందుకు మరో రూ.10 కోట్ల మేర ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన ఆరోపణ.

ఈ నిధులు కేటీఆర్ ఆధ్వర్యంలోని పురపాలక శాఖ నుంచే వెళ్లాయి. దీంతో కేటీఆర్ తో పాటు నాడు హెచ్ఎండీఏ చీఫ్ గా కొనసాగిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, చీఫ్ ఇంచిజీన్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావుతో పాటు ఈ కారు రేసుల సంస్థలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.

ఈ కేసు విచారణల కోసం కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ అదికారుల ముందు హాజరయ్యారు. విడతలవారీగా జరిగిన ఈ విచారణల్లో అధికారులు అడిగిన అన్నిప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానంటూ విచారణల అనంతరం కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక అరవింద్ కుమార్ తో పాటు బీఎల్ఎన్ రెడ్డి కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

ఈ విచారణల అనంతరం విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు చెప్పిన వివరాలు, దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా ఏసీబీ అధికారులు ఇటీవలే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. తదుపరి విచారణకు హాజరు కావాలంటూ నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది.

ఈ కేసులో తానెలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏమీ లేదంటూ ఆయన ఇదో లొట్టపీసు కేసు అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. విదేశీ సంస్థకు నిధులు పంపిన మాట వాస్తవమేనని చెబుతున్న కేటీఆర్… తామేమీ రహస్యంగా ఆ సంస్థకు డబ్బులు చెల్లించలేదని, నిబంధనల మేరకే డబ్బు పంపామని వాదిస్తున్నారు.

అయితే ఇలా విదేశీ సంస్థలకు సర్కారీ సొమ్మును పంపే విషయంలో కేటీఆర్, నాడు సంబంధిత శాఖ అదికారులు నిబంధనలను పాటించలేదన్నది ఏసీబీ వాదన. ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్ ను కోర్టు విచారణకు స్వీకరించిందంటే… ఈ కేసులో ఎంతో కొంత నేరముందన్న అబిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న వాదనలకు బలం చేకూరుతోంది.

Kumar

Recent Posts

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

32 minutes ago

హ‌మ్మ‌య్య‌… ఎట్ట‌కేల‌కు క‌దిలిన క‌మ‌ల‌నాథులు!

ఏపీలో కూట‌మిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గ‌త రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెద‌వి విప్పి.. కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన…

37 minutes ago

నోలన్ విధ్వంసానికి ఆకాశమే హద్దు

ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…

52 minutes ago

ప్రభాస్ పోస్టర్ ఏం చెబుతోంది

అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…

2 hours ago

వారణాసికి ఐమాక్స్ తెరల సమస్య

ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…

3 hours ago

ఇస్రో కు షాకిస్తున్న రాజీనామాలు… కట్టడికి కొత్త రూల్స్!

భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు…

3 hours ago