Political News

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో చూపించే విషయాలను గమనిస్తే భయం కలుగుతుంది. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఎవ్వరైనా బెంబేలెత్తిపోతారు.

కానీ అలాంటి చోటికి డబ్బులు పెట్టుకుని ఎవరైనా వెళ్తారా? కానీ దీన్ని శిక్షగా భావించకుండా.. జస్ట్ ఒక ఎక్స్‌పీరియర్స్‌గా భావించి జైలు సందర్శనకు రండి అంటున్నారు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు అధికారులు. ఈ జైలు ఎంత ఫేమస్ అన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు జైలు జీవితం గడిపింది ఇక్కడే.

జగన్ వల్లే ఈ జైలు బాగా పాపులర్ అయిందన్నది వాస్తవం. ఇప్పుడీ జైల్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అధికారులు. ఇక్కడ నేరస్థులకు కాకుండా.. ప్రత్యేకంగా సందర్శకుల కోసం ఒక బ్యారక్ ఏర్పాటు చేశారు. జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి.. అక్కడ ఉన్న వారి జీవితం ఎలా సాగుతుంది అన్నది అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలంటే రూ.500 కట్టి ఈ జైల్లోకి ఎంటర్ కావచ్చు.

ఫీజు కట్టి జైల్లో వెళ్లాక 24 గంటల పాటు అక్కడే ఉండాలి. ఖైదీలకు ఎలాంటి గదులిస్తారు.. వాళ్లకు సౌకర్యాలు ఎలా ఉంటాయి.. ఖైదీల దిన చర్య ఎలా ఉంటుంది.. వాళ్లక్కడ ఎలాంటి పనులు చేస్తారు.. వివిధ రకాల ఖైదీలను జైలు సిబ్బంది ఎలా ట్రీట్ చేస్తారు.. ఇవన్నీ పరిశీలించే అవకాశం ఉంటుంది. రాత్రి పడుకోవడానికి ఖైదీల తరహాలోనే గదులు ఉంటాయి.

దీంతో పాటు జైల్లోని మ్యూజియంను కూడా సందర్శించవచ్చు. ఐతే ఒకసారి లోపలికి వెళ్లాక 24 గంటల పాటు అక్కడ ఉండలేక, వెనక్కి వచ్చేయాలంటే మాత్రం రూ.1000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇది వినోదం కోసం కాదని.. జైలు జీవితం ఎలా ఉంటుందో సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం ప్రవేశపెట్టామని తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు.

This post was last modified on May 14, 2026 7:55 pm

Share

Recent Posts

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

38 minutes ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

41 minutes ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

2 hours ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

8 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

10 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

11 hours ago