కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8న పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నారని, ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ రోజు భగీరథ్ పోలీసు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులిచ్చారు. వాస్తవారిని ఆ నోటీసులు బండి సంజయ్ నివాసంలో ఇవ్వాల్సి ఉంది.
కానీ, అందుకు భిన్నంగా సంజయ్ బావమరిది ఇంటికి వెళ్లి నోటీసులిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే, భగీరథ్ ఆ ఇంట్లో ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే, భగీరథ్ విచారణకు గైర్హాజరవుతారు అన్నది ఊహించినదే. కానీ, అక్కడ విచారణ చేయాల్సిన సిట్ బృందంలోని పోలీసు అధికారులు కూడా స్టేషన్ కు రాలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అంటే, భగీరథ్ రాడని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ నాయకులకు, సామాన్యులకు వేర్వేరుగా న్యాయం జరుగుతోందంటూ విమర్శిస్తున్నారు. ఇదే ఒక సామాన్యుడిపై పోక్సో కేసు నమోదై ఉంటే ఈ పాటికి అరెస్టు చేసి ముప్పుతిప్పలు పెట్టేవారని పోలీసుల తీరును కూడా చాలామంది నెటిజనులు తప్పుబడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates